అశ్వఘోషుడు
భారత దేశ బౌద్ధ కవి మరియు తత్వవేత్త / From Wikipedia, the free encyclopedia
ఆశ్వఘోషుడు క్రీ. శ. 80–150 కాలానికి చెందిన బౌద్ధ దార్శనికుడు. సంస్కృత పండితుడు. మహాకవి. నాటకకర్త. ఇతనిని సంస్కృత వాజ్మయమున తొలి నాటకకర్తగా భావిస్తారు. అశ్వఘోషుడు కాళిదాసు కన్నా పూర్వుడని, కాళిదాసుని కవిత్వంపై అశ్వఘోషుని ప్రభావం వుందని పాశ్చాత్య సంస్కృత సాహిత్యకారులందరూ తేల్చి చెప్పారు.[1] [2] బౌద్ధ దార్శనికుడైన ఆశ్వఘోషుడు బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి తన కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకొన్నాడు. అయితే దార్శనికుడుగా కంటే మహాకవిగా ఎక్కువ గుర్తింపు పొందాడు. సమకాలీన రామాయణానికి పోటీగా కావ్యాలను రచించిన బౌద్ధ కవులలో అత్యంత ప్రాచుర్యం పొందాడు.[3] ఇతను రచించిన సంస్కృత గ్రంథాలలో బుద్ధచరితం, సౌందరనందం అనే రెండు మహా కావ్యాలు, సారిపుత్ర ప్రకరణం అనే నాటకం, వజ్రసూచి అనే బౌద్ధ ధర్మ సంబందమైన గ్రంథం ముఖ్యమైనవి.
త్వరిత వాస్తవాలు అశ్వఘోషుడు, జననం ...
అశ్వఘోషుడు | |
---|---|
జననం | సా.శ. 80 సాకేతపురం (అయోధ్య) |
మరణం | సా.శ. 150 పెషావర్ (ప్రస్తుత పాకిస్తాన్) |
వృత్తి | బౌద్ధ దార్శనికుడు, సంస్కృత పండితుడు, మహాకవి, నాటకకర్త |
ప్రసిద్ధి | సంస్కృత వాజ్మయమున తొలి నాటకకర్త |
ముఖ్యమైన సేవలు | నాల్గవ బౌద్ధ సంగీతికి ఉపాధ్యక్షుడు |
మతం | బౌద్ధమతం |
తల్లి | సువర్ణాక్షి |
రచనలు: బుద్ధచరితం, సౌందరనందం, సారిపుత్ర ప్రకరణం, వజ్రసూచి |
మూసివేయి