ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలిని, ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు.ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీలో విశ్వాసం ఉన్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ఎన్నిపర్యాయాలైనా ముఖ్యమంత్రిగా ఎంపిక కావటానికి ఎటువంటి కాల పరిమితులకు లోబడి ఉండదు.[1]
ఆంధ్రప్రదేశ్ , ముఖ్యమంత్రి | |
---|---|
విధం | గౌరవనీయులైన, ముఖ్యమంత్రి వర్యులు |
స్థితి | ప్రభుత్వ అధినేత |
Abbreviation | సీఎం |
సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మంత్రిమండలి |
అధికారిక నివాసం | అమరావతి, ఆంధ్రప్రదేశ్ |
స్థానం | ఆంధ్రప్రదేశ్ సచివాలయం, అమరావతి, ఆంధ్రప్రదేశ్ |
నియామకం | ఆంధ్రప్రదేశ్ గవర్నరు |
కాలవ్యవధి | శాసనసభ విశ్వాసం ఉన్నంతకాలం ఐదు సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ |
|
నిర్మాణం | 1 నవంబరు 1956; 67 సంవత్సరాల క్రితం (1956-11-01) 2 జూన్ 2014; 10 సంవత్సరాల క్రితం (2014-06-02) |
1953 నుండి 2019 వరకు 19 మంది ముఖ్యమంత్రులు ఆ పదవిలో పనిచేసారు. వారిలో ఎక్కువ మంది భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి) కి చెందినవారు. 1953లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి) నుండి టంగుటూరి ప్రకాశం ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఐ.ఎన్.సి నుండి నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) నుండి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్. చంద్రబాబు నాయుడు పదమూడు సంవత్సరాలకు పైగా అనేక పర్యాయాలు పదవిలో కొనసాగారు. అయితే టిడిపి నుండి నాదెండ్ల భాస్కరరావు అతి తక్కువ పదవీకాలం (31 రోజులు) పనిచేసాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి అయ్యాడు. అలాగే నాల్గవ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి. వి. నరసింహారావు తరువాతి కాలంలో ప్రధాన మంత్రిగా పనిచేసాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్. టి. రామారావు రాష్ట్రానికి కాంగ్రెస్యేతర మొదటి ముఖ్యమంత్రి. ఇటీవల 2014లో ఆంధ్రప్రదేశ్లో మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు.