![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/57/India-locator-map-blank.svg/langte-640px-India-locator-map-blank.svg.png&w=640&q=50)
అమేఠీ
From Wikipedia, the free encyclopedia
అమేఠీ ఉత్తర ప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లాలో ఒక నగరపంచాయితీ. ఫైజాబాద్ డివిజను లోని అమేఠీ జిల్లాలో ఇదొక పెద్ద పట్టణం. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేఠీ తరచూ వార్తలలో వస్తూంటూంది. ఈ లోక్సభ స్థానం నుండి, జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో రాహుల్ గాంధీ కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో ఐఐఐటి ఉంది. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.
?అమేఠీ ఉత్తర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 26.15°N 81.82°E / 26.15; 81.82 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 100 మీ (328 అడుగులు) |
జిల్లా (లు) | సుల్తాన్ పూర్ జిల్లా |
జనాభా | 12,808 (2001 నాటికి) |
కోడులు • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• ++915368 |
గతంలో అమేఠీని రాయ్పూర్-అమేఠీ అని పిలిచేవారు. అమేఠీ రాజు కోట రాయ్పూరులో ఉండేది. రాజు పూర్వీకులు రాయ్పూర్-ఫుల్వారీలో నివసించేవారు. అక్కడ పాతకోట ఇప్పటికీ ఉంది. పట్టణానికి దగ్గర్లో హనుమన్గఢీ అలయం ఉంది. అమేఠీలోని మసీదు, ఈ దేవాలయం రెండూ వంద సంవత్సరాల నాటివి. అమేఠీ నుండి 3 కి.మీ. దూరంలో మాలిక్ మహమ్మద్ జయాసీ అనే కవి సమాధి ఉంది.[1]
అమేఠీ లోక్సభ నియోజకవర్గానికి, అమేఠీ శాసనసభ నియోజక వర్గానికీ అమేఠీ పట్టణం కేంద్రం.