అమృతా షేర్-గిల్
భారతీయ చిత్రకారిణి / From Wikipedia, the free encyclopedia
అమృతా షేర్ గిల్ (ఆంగ్లం: Amrita Sher-Gil) (30 జనవరి 1913[1] - 1941 డిసెంబరు 5) 20వ శతాబ్దానికి ప్రముఖ భారతీయ చిత్రకారిణి. అమృత తండ్రి పంజాబీ, తల్లి హంగేరీ యూదు. అమృత భారతదేశపు ఫ్రీడా కాహ్లోగా వ్యవహరించబడింది. (ఫ్రీడా కాహ్లో మెక్సికన్ చిత్రకారులు.) భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ లను చిత్రీకరించిన మహిళా చిత్రకారులు అమృతాయే. 1938లో గోరఖ్పుర్లోని తన ఎస్టేట్లో గీసిన ‘ఇన్ ది లేడీస్ ఎన్క్లోజర్’ చిత్రం వేలంలో రూ.37.8 కోట్లకు అమ్ముడుపోయింది. భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యధిక ధర ఇది. అమృతా షేర్ గిల్ చిత్రాల్లో ఇప్పటివరకూ అత్యధిక ధర పలికింది కూడా ఇదే. 2021లో శాఫ్రాన్ఆర్ట్ సంస్థ ఈ వేలం నిర్వహించింది.[2]
అమృతా షేర్ గిల్ | |
---|---|
జననం | (1913-01-30)1913 జనవరి 30 బుడాపెస్ట్, హంగేరీ |
మరణం | 1941 డిసెంబరు 5(1941-12-05) (వయసు 28) లాహోర్, బ్రిటీషు రాజ్యం (ప్రస్తుత పాకిస్తాన్) |
జాతీయత | భారతీయురాలు |
రంగం | చిత్రకారులు |
శిక్షణ | Grande Chaumiere École des Beaux-Arts (1930–34) |
2023 సెప్టెంబరు 16న జరిగిన సాఫ్రోనార్ట్ వేలంలో అమృతా షేర్ గిల్ కాన్వాస్పై గీసిన అందమైన ఆయిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ రూ. 61.8 కోట్లకు ($7.4 మిలియన్లు) ధర పలికింది. దీంతో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టేషన్’ పెయింటింగ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలుకొట్టినట్టయింది. ఒక భారతీయ పేయింటర్ వేసిన చిత్రానికి లభించిన అత్యధిక ధర ఇదే అవడం విశేషం.[3]