మే 30: మొదటి పారిస్ ఒప్పందం కుదిరింది. అదే రోజున నెపోలియన్ను ఎల్బా ద్వీపానికి ద్వీపాంతరవాస శిక్షను విధించరు. దాని ప్రకారం కారైక్కల్ ప్రాంతం ఫ్రెంచి వారి వశమైంది. మాల్టా ఒక బ్రిటిషు కాలనీగా మారిపోయింది.
జూలై 25: జార్జ్ స్టీఫెన్సన్ తన తొలి ఆవిరి లోకోమోటివ్ ను పరీక్షించాడు.
ఆగస్టు 13: లండన్లో ఆంగ్లో డచ్చి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1803 తరువాత డచ్చి వారినుండి ఇంగ్లాండు ఆక్రమించుకున్న భూభాగాలు చాలావరకు వెనక్కి ఇచ్చెయ్యాలి. కొచ్చిన్ను డచ్చివారు బ్రిటిషు వారికి ఇచ్చెయ్యాలి. ఈ ఒప్పందంతో భారతదేశంలో డచ్చి వారి ఉనికి లేకుండా పోయింది.
ఆగస్టు 24-25: బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ దాడి జరిగింది.