1808
From Wikipedia, the free encyclopedia
1808 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1805 1806 1807 - 1808 - 1809 1810 1811 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 1: అమెరికా బానిసల దిగుమతిని నిషేధించింది. క్యూబా 1865వ్ వరకూ ఈ నిషేధం విధించలేదు. అప్పటికి 5 లక్షలకు పైగా బానిసలను క్యూబాకు తెచ్చారు.[1]
- జనవరి 1: సియెర్రా లియోన్ బ్రిటను వలసగా మారిపోయింది.
- ఫిబ్రవరి 21: రష్యా సైన్యం ఫిన్లాండు లోకి ప్రవేశించడంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.
- మార్చి 7: పోర్చుగల్ను ప్రాన్సు ఆక్రమించడంతో పోర్చుగీసు యువరాజు, అతడి కుటుంబమూ పోర్చుగీసు రాజదర్బారును బ్రెజిల్ లోని రియో డి జనీరో నగరానికి తరలించారు. దాంతో యావత్తు పోర్చుగీసు సామ్రాజ్యానికి ఇది కేంద్రమైంది.
- ఏప్రిల్: పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆ సంవత్సరం అక్కడి సముద్రపు గాలి చుట్టుపక్కల గాలి ఉష్ణోగ్రత పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు గాలి ఉష్ణోగ్రతలు ఐదేళ్ళ పాటు తగ్గిపోయాయి. [2]
- జూన్ 15: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
- జూన్ 30: హంఫ్రీ డేవీ ఒక కొత్త మూలకాన్ని కునుగొని దానికి బొరాసియం అని పేరు పెట్టాడు. దానికే తరువాత బోరాన్ అని పేరు పెట్టారు.[3] ఇదే సంవత్సరం కాల్షియం మూలకాన్ని కూడా కనుగొన్నాడు
- సెప్టెంబరు 29: రష్యా ఫిన్లాండుల మధ్య సంధి కుదిరింది. కాని అక్టోబరు 19 న ఇది భగ్నమైంది.
- అక్టోబరు 6: హంఫ్రీ డేవీ పొటాష్ నుండి పొటాషియమ్ను వేరు చేసాడు
- డిసెంబరు 1: రష్యను జారు చక్రవర్తి మొదటి అలెగ్జాండరు, ఫిన్లాండు తన రాజ్యంలో భాగమని ప్రకటించాడు
- తేదీ తెలియదు: దత్తమండలం నుండి బళ్ళారి, కడప జిల్లాలను ఏర్పరచారు.
జననాలు

- జనవరి 22: జేమ్స్ ఫెర్గుసన్, భారతీయ వాస్తుశైలిపై పరిశోధనలు చేసిన వాస్తు చారిత్రికుడు (మ. 1886)
- డిసెంబరు 29: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- తేదీ తెలియదు: మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి, మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు. (మ. 1873)
- తేదీ తెలియదు: రాకమచర్ల వేంకటదాసు, వాగ్గేయకారుడు (మ. 1859)
మరణాలు
- తేదీ తెలియదు: హైదరాబాదు దివాను మీరాలం. ఇతడి పేరిటే మీరాలం చెరువును నిర్మించారు
పురస్కారాలు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.