ఆగస్టు 1: అమెరికా ట్రిపోలి, అల్జీర్స్, ట్యునిస్, మొరాకోలపై మొదటి బార్బరీ యుద్ధం మొదలుపెట్టింది. ఈ దేశాలకు చెందిన సముద్రపు దొంగలు అమెరికా నౌకలను పట్టుకుని, వాటిని విడిచేందుకు డబ్బులు డిమాండు చేసేవారు.
అక్టోబరు 24: స్వాతంత్ర్య సమర యోధులైన మరుదు సోదరులను బ్రిటిషు వారు శివగంగై జిల్లా లోని తిరుపత్తూరులో ఉన్న శిథిలమైన కోటలో ఉరితీసారు.
నవంబరు 10: సైన్య సహకర ఒప్పందం కింద బ్రిటిషు వారికి చెల్లించాల్సిన రుణానికి బదులుగా నవాబు సాదత్ అలి ఖాన్, రోహిల్ఖండును 1801 నవంబరు 10 ఒప్పందం తరువాత ఈస్టిండియా కంపెనీకి స్వాధీనం చేసాడు.[2]