సుకుమారి
సినీ నటి From Wikipedia, the free encyclopedia
పద్మశ్రీ సుకుమారి ప్రముఖ భారతదేశ సినీ నటి. తెలుగు, తమిళం, మళయాళం, ఒరియా, బెంగాలీ భాషలలో దాదాపు 2000 చిత్రాలలో నటించింది.
సుకుమారి | |
జన్మ నామం | సుకుమారి కొల్లం |
జననం | నాగర్కోవిల్, | 1938 ఆగస్టు 15
మరణం | 26 మార్చి 2013 74) మద్రాసు, భారతదేశం | (aged
భార్య/భర్త | ఎ. భీం సింగ్ |
ప్రముఖ పాత్రలు | మాంగల్య బలం పల్లెటూరి బావ మురారి నిర్ణయం |
నేపధ్యము
ఈమె మాతృభాష మళయాళం 1938 న తమిళనాడులోని నాగర్కోయిల్లో జన్మించింది. తెలుగులో మురారి చిత్రంలో మహేశ్ బాబు బామ్మ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కుటుంబము
దివంగత దర్శకుడు ఎ.భీంసింగ్ ను వివాహము చేసుకున్నారు. వీరికి డాక్టర్ సురేశ్ సింగ్ సంతానము.
నట ప్రస్థానము
చిన్న నాటి నుండి నృత్యం, రంగస్థల ప్రధర్శనలలో ఆసక్తి చూపేవారు. బాల నటిగా అనేక చిత్రాలలో నటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై రచించిన ఓర్ ఇరువు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.
మరణం
ఇంటిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 26 మార్చి 2013 న తుది శ్వాస వదిలారు.
నటించిన చిత్రాల పాక్షిక జాబితా
తెలుగు
- వీర సేనాపతి (1964)
- అభిమన్యు (1992)
- మురారి (2001)
- మాంగల్యబలం
- పల్లెటూరి బావ
- నిర్ణయం (సినిమా)
- సాంబ
- కుదిరితే కప్పు కాఫీ
ఇతర భాషలు
- సమాంతరంగల్ (మలయాళం)
పురస్కారములు

- 2003 లో పద్మశ్రీ
- 2011 లో జాతీయ ఉత్తమ సహాయనటి (నమ్మ గ్రామం తమిళ,మళయాళ చిత్రం)
బయటి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.