భక్త తుకారాం

తెలుగు భక్తిరస చిత్రం From Wikipedia, the free encyclopedia

భక్త తుకారాం
Remove ads

భక్త తుకారాం వి. మధుసూదనరావు దర్శకత్వంలో 1973లో వచ్చిన తెలుగు భక్తిరస చిత్రం. ఈ చిత్రాన్ని అంజలిపిక్చర్స్ పతాకంపై పి. ఆదినారాయణరావు నిర్మించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, శివాజీ గణేశన్, కాంచన, నాగభూషణం మొదలగు వారు నటించారు. సంగీతం పి.ఆదినారాయణరావు సమకూర్చారు. మహారాష్ట్రకు చెందిన పాండురంగని భక్తుడు తుకారాం జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది.

త్వరిత వాస్తవాలు భక్త తుకారాం, దర్శకత్వం ...
Remove ads

కథ

కథాస్థానం మహారాష్ట్రలో దేహూ గ్రామం. కథాకాలం పదిహేడవ శతాబ్దపు తొలి అర్థం. భక్తి ఉద్యమ కాలం.

తుకారాం పాండురంగడికి మహాభక్తుడు. భార్య ఇద్దరు బిడ్డలతో సంసారి. భక్తునిగా అతని గుర్తింపు, గొప్ప భక్తునిగా చెప్పుకుంటూ ఇద్దరు శిష్యులతో గ్రామాన్ని మోసం చేస్తున్న కుంభోజీ కి ఇబ్బంది కలిగిస్తుంది. తుకారాం ప్రాభవాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అతనిపై వేశ్యను ప్రయోగిస్తాడు. ఆమె తుకారాం భక్తురాలిగా మారిపోతుంది. శూద్రుడైన తుకారాం వ్రాసిన అభంగాలు హైందవ సంప్రదాయానికి విరుద్ధమని వాటిని నాశనం చేయాలని పీఠాధిపతితో చెప్పిస్తాడు కుంభోజి. ఎంతో శ్రమతో కూర్చిన అభంగాలు నీటిపాలు కావటంతో కలత చెందిన తుకారాం నది ఒడ్డునే నిద్రాహారాలు మాని ఉండి పోతాడు. దివ్య శక్తి అభంగాలు తిరిగి ప్రసాదించగా ఆనందపరవశుడౌతాడు. తుకారాం పట్ల నిర్దయగా ఉన్న పీఠాధిపతి సైతం తుకారాం భక్తిని తెలుసుకుంటాడు. కుంభోజి ఆలయంలోని పాండురంగని విగ్రహాన్ని నూతిలో పడవేసి, శూద్రుడైన తుకారాం చర్యల్ని భరించలేని పాండురంగడు గుడి నుండి వెళ్ళిపోయాడని ప్రచారం చేస్తాడు. అదే విషయాన్ని శివాజీ మహారాజుకు ఫిర్యాదు చేస్తాడు. ఇదివరలో తుకారాం గురించి విన్న శివాజీ అతనికి కానుకలు పంపగా తుకారాం తిరస్కరించి ఉంటాడు. అతణ్ణి పరిశీలించే దృష్టితో శివాజీ, ఫిర్యాదును విచారించే నిమిత్తం తుకారాం దగ్గరకు వస్తాడు. శివాజీ చూస్తుండగానే పాండురంగని విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షం ఔతుంది. ఈ లోపులో కుంభోజీ అందించిన సమాచారంతో, శివాజీ శత్రువులు సన్నద్ధంగా లేని శివాజీను చుట్టుముడతారు. తుకారాం కోరిక మేరకు పాండురంగడు అనేక శివాజీ మూర్తులుగా శత్రువుల్ని తుదముట్టిస్తాడు. శివాజీ తుకారాం భక్తి తత్పరతకు పరవశుడై తనను శిష్యునిగా స్వీకరించమంటాడు. క్షాత్రమున్నవారు రాజ్యాన్ని రక్షించాలని శివాజీకి తెలియజేస్తాడు.

సంసారిగా ఉంటూ, తన కర్తవ్యాలన్నిటినీ నెరవేరుస్తూనే, ఆధ్యాత్మికతను కూడా కొనసాగించడం, తుకారాం ప్రత్యేకత అని మహావిష్ణువు లక్ష్మికి తెలియజేసి అతని కోసం గరుడ వాహనాన్ని పంపి తన వద్దకు రప్పించుకుంటాడు.

Remove ads

తారాగణం

  • తుకారాంగా అక్కినేని నాగేశ్వరరావు
  • తుకారాం భార్యగా అంజలీదేవి
  • ఛత్రపతి శివాజీగా శివాజీ గణేశన్
  • కాంచన
  • కుంభోజీగా నాగభూషణం
  • ధూళిపాళ
  • సాక్షి రంగారావు
  • జి.రామకృష్ణ
  • భానుప్రకాష్

సాంకేతిక వర్గం

దర్శకుడు: వీరమాచినేని మధుసూదనరావు

నిర్మాత, సంగీతం: పి. ఆదినారాయణరావు

గీత రచయితలు: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి , దాశరథి కృష్ణమాచార్య

నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, విస్సంరాజు రామకృష్ణ దాస్

నిర్మాణ సంస్థ: అంజలి పిక్చర్స్

చిత్రీకరణ

చిత్రంలో సింహభాగం హంపీ నగరం, తుంగభద్ర నదీ పరిసరాల్లో చిత్రీకరించబడింది. అనేక ఫ్రేముల్లో హంపీ విరూపాక్ష దేవాలయం కాన వస్తుంది. పండరీపురంలోని ఆలయానికి, విరూపాక్ష ఆలయానికి వాస్తు రీత్యా చాలా వ్యత్యాసంఉంది.

విశేషాలు

నటి శ్రీదేవి తుకారాం కూతురిగా కనిపిస్తుంది. లవకుశలో నటించిన నాగరాజు మహావిష్ణువుగా నటించారు. గాయకుడు వి.రామకృష్ణ, ఘంటసాల అనారోగ్య కారణంగా ఈ చిత్రంలో పాటలు పాడే అవకాశం పొందాడు. దర్శకుడు వి. మధుసూదనరావు స్వతహాగా వామపక్ష భావాలు కలిగినవాడు. ఆస్తికత్వానికి సంబంధించిన ఈ చిత్రంలో అభ్యుదయ భావాలతో కూడిన సంభాషణలు ఉంటాయి. ఉదా: పీఠాధిపతితో తుకారాం సంభాషణ.

పాటలు

మరింత సమాచారం పాట, రచయిత ...
  • రంగని సేవ చేయుచు (పద్యం), రచన : వీటూరి ఘంటసాల.
  • వనిత కవితయు వలచి రావలెనే (పద్యం) , రచన : వీటూరి. గానం . ఘంటసాల.
  • వన్నె తరగని వజ్రాలు, రచన : వీటూరీ . గానం . ఘంటసాల .
  • చిందులు వేయకురా , రచన : వీటూరి, గానం . ఘంటసాల
  • కేశవా నారాయణా మాధవ గోవిందా దేవాది దేవా (స్తుతి), గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు
  • గాత్రము కల్గినేని హరిగాథలు గానము సేయగావలెన్(పద్యం), రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.వి రామకృష్ణ దాస్
  • ధాన్యలక్ష్మి వచ్చింది మా ఇంటికి మా కరువు తీరింది ఈనాటికీ, రచన: వీటూరి, గానం.పులపాక సుశీల
  • నీవే ఆదిదైవము జగతికి నీవే నీవే మూలం, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.వి.రామకృష్ణ దాస్
  • పరమ యోగులు చూడని పరమ పురుష వేల్పులకు(పద్యం), రచన: వీటూరి, గానం.రామకృష్ణ
  • పాండురంగ నామం పరమ పుణ్యధామం అదే మోక్షతీరం, రచన: వీటూరి, గానం.వి.రామకృష్ణ
  • పాండురంగ హరి హరి పాండురంగ హరి, గానం.విస్సంరాజు రామకృష్ణ దాస్
  • మనసుననీవే నిలిచిన వేళా జపములు తపములు ఇంకేలా, రచన: దాశరథి, గానం.వి.రామకృష్ణ దాస్
  • యమునాతీర నివాసాయా పండరీపుర వాసినే, రచన: వీటూరి, గానం.వి.రామకృష్ణ దాస్
  • వన్నెతరగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని రతనాలు(పద్యం), రచన: వీటూరి, గానం.ఘంటసాల
  • శ్యామసుందరా ప్రేమమందిరా నీ నామమే వీనులవిందురా, రచన: దాశరథి, గానం వి.రామకృష్ణ
  • సర్వసుఖాలకు నిలయందేహం ఈదేహం పై, రచన:దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల.
Remove ads

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads