From Wikipedia, the free encyclopedia
బీదరు లేదా బీదర్ (ఆంగ్లం:Bidar) కర్ణాటక రాష్ట్రం ఈశాన్య భాగంలో ఉన్న ఒక కొండపై ఉన్న నగరం. ఇది మహారాష్ట్ర తెలంగాణల సరిహద్దుల్లో ఉన్న బీదరు జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఈ ప్రాంతంలో వేగంగా పట్టణీకరణ చెందుతున్న నగరం. ఈ నగరం వాస్తు, చారిత్రక, మత ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలకు నెలవు.
బీదరు Bidar బీదర్ | ||||||
---|---|---|---|---|---|---|
భారతదేశం కర్ణాటక రాష్ట్రం | ||||||
Coordinates (బీదర్): 17.9°N 77.5°E[1] | ||||||
దేశం | భారతదేశం | |||||
రాష్ట్రం | కర్ణాటక | |||||
Division | కలబురగి డివిజన్ | |||||
Region | హైదరాబాద్ కర్ణాటక (ಕಲ್ಯಾಣ ಕನಾಽಟಕ) | |||||
జిల్లా | బీదరు జిల్లా | |||||
Named for | బిద్రి | |||||
Government | ||||||
• Type | మునిసిపాలిటీ | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 43 కి.మీ2 (17 చ. మై) | |||||
Elevation | 710 మీ (2,330 అ.) | |||||
జనాభా (2011) | ||||||
• Total | 2,16,020 | |||||
• Estimate (2021)[4] | 2,60,201 | |||||
• జనసాంద్రత | 5,000/కి.మీ2 (13,000/చ. మై.) | |||||
• Males | 1,11,470 | |||||
• Males density | 2,592/కి.మీ2 (6,710/చ. మై.) | |||||
• Females | 1,04,550 | |||||
• Females density | 2,432/కి.మీ2 (6,300/చ. మై.) | |||||
Demonym | "Bidri" | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
పిన్కోడ్ | 585 401/02/03 | |||||
Telephone code | 91-(0)8482-XXXXXX | |||||
Vehicle registration | KA-38 |
రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి బీదరు సుమారు 700 కి.మీ. దూరంలో ఉంది ఈ నగరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం పాటు నిర్లక్ష్యం వహించింది. అయినప్పటికీ, గొప్ప వారసత్వం కారణంగా, ఈ నగరం భారత పురావస్తు పటంలో ముఖ్య స్థానం పొందింది. దక్కన్ పీఠభూమిపై ఉన్న అందమైన బీదరు కోట 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇప్పటికీ బలంగా ఉంది. [5]
బీదరు నగరం బిద్రి హస్తకళ ఉత్పత్తులకు ప్రసిద్ధి. సిక్కులకు కూడా బీదరు పవిత్రమైన తీర్థయాత్రా స్థలం. ఉత్తర కర్ణాటక లోని ఇతర ప్రదేశాల మాదిరిగా కాకుండా బీదరు, ఈ ప్రాంతంలో అత్యంత శీతలంగా, తేమగా ఉంటుంది. 2009-10 సంవత్సరానికి, భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో బీదరు 22 వ స్థానంలోనుమ్ కర్ణాటకలో 5 వ స్థానంలోనూ ఉంది. [6] రాష్ట్ర రహదారి 4 బీదరు గుండా వెళుతుంది. మొత్తం నగరం 4 వరసల రహదారితో అనుసంధానించబడి ఉంది.
సంప్రదాయ కథల ప్రకారం విదురుడు ఇక్కడ నివసించాడని భావిస్తారు; అందువల్ల గతంలో ఈ స్థలాన్ని విదురనగర అని పిలిచేవారు. నలుడు, దమయంతి (విదర్భ రాజు భీముడి కుమార్తె) కలిసిన ప్రదేశం ఇదేనని కూడా విశ్వసిస్తారు. [7] బహమనీ సుల్తానుల పాలనలో బీదరును ముహమ్మదాబాద్ అని పిలిచేవారు.
క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో బీదరు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉంది. మౌర్యుల తరువాత, శాతవాహనులు, కాదంబులు, బాదామి చాళుక్యుల తరువాత రాష్ట్రకూటులు బీదరు ప్రాంతాన్ని పాలించారు. కల్యాణి చాళుక్యులు, కాలచుర్యులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. కళ్యాణి చాళుక్యుల తర్వాత కొంత కాలం పాటు కోసం ఈ ప్రాంతాన్ని దేవగిరి యాదవులు, ఓరుగల్లు కాకతీయులూ పాలించారు. ముహమ్మద్-బిన్-తుగ్లక్ బీదరుతో సహా మొత్తం దక్కన్ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
1724 లో నిజాం అసఫ్ జా (నిజాం) మూడవ కుమారుడైన సలాబత్ జంగ్, 1751 నుండి 1762 వరకు బీదరు కోట నుండి పరిపాలించాడు, అతని సోదరుడు మీర్ నిజాం అలీ ఖాన్ అసఫ్ జా III అతన్ని ఈ కోటలో ఖైదు చేసి, 1763 సెప్టెంబరు 16 న హతం చేసాడు. బీదరు పాత పేరైన మొహమ్మదాబాద్ అతని పేరు మీదుగానే వచ్చింది. ఇది 20 వ శతాబ్దం ప్రారంభంలో బీద్రు నుండి హైదరాబాద్కు రైలు మార్గం వేసారు. [8] భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, 1956 లో కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నిటినీ కలిపి మైసూరు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు బీదరును అందులో కలిపారు. 1973 లో మైసూరు రాష్ట్రాన్ని కర్ణాటకగా పేరుమార్చారు.. [9] [10] [11]
బీదరు దక్కన్ పీఠభూమి మధ్య ప్రాంతంలో 17.9°N 77.5°E వద్ద, [12] సముద్ర మట్టం నుండి 2,300 అడుగుల ఎత్తున ఉంది. బీదరు జిల్లాకు మహారాష్ట్ర తెలంగాణలతో సాధారణ సరిహద్దులు ఉన్నాయి, తూర్పున తెలంగాణలోని నిజామాబాద్ మెదక్ జిల్లాలు, పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్, ఉస్మానాబాద్ జిల్లాలు. దక్షిణాన గుల్బర్గా జిల్లాలు ఉన్నాయి.
బీదరు నేలలు లోతుగా ఉన్నాయి (100 సెం.మీ), పీఠభూములలో బాగా ఎండిపోయిన కంకర ఎరుపు బంకమట్టి నేలలు. అధిక కంకర నేలలు, ఇవి లోతుగా తవ్వినచో తగ్గుతాయి. [13]
ఒకప్పుడు పత్తి వడకడం వంటి అనేక కుటీర పరిశ్రమలకు నిలయంగా ఉన్న బీదరులో, [14] ప్రస్తుతం స్థానిక ముడి పదార్థాలపై ఆధారపడిన పరిశ్రమలు అతి కొద్ది సంఖ్యలో ఉన్నాయి. స్థానిక కళాఖండాల రూపమైన, బిద్రి కళ కూడా క్షీణదశలో ఉంది. పెరుగుతున్న పదార్థాల ధరలు, ముఖ్యంగా వెండి ధరలు పెరగడం, అమ్మకాలు క్షీణించడం వలన వంశపారంపర్యంగా పనిచేసే చేతివృత్తులవారికి ఉపాధి కరువౌతోంది. [15] బీదరు నగరంలో కొఠారు అనే పెద్ద పారిశ్రామిక ప్రాంతం ఉంది.
బీదర్ కోట [16] దేశంలోని అత్యంత బలిష్ఠమైన కోటలలో ఒకటి. బీదరు నగరం ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించబడింది. రాజాస్థానం, నగరం ఈ రెండింటికీ రక్షణ కోసం విడిగా కోటలు ఉన్నాయి, బీదరు నగర కోటలోకి ప్రవేశించడానికి ఐదు ద్వారాలు ఉన్నాయి. ఇది పీఠభూమి అంచున నిర్మించబడింది. దాని రూపకల్పన నిర్మాణంపై వివిధ దేశాల ఇంజనీర్లు పనిచేసారు. వివిధ వాస్తురీతులను వాడారు. బీదరులో పాత యుద్ధ వస్తువులు, పాత శిల్పాలు, ప్రాచీన శిలలతో కూడుకున్న మ్యూజియం ఉంది.,[17]
బీదరు నుండి బెంగుళూర్, హైదరాబాద్, ఔరంగాబాద్, లాతూర్, నాందేడ్, మన్మాడ్, ముంబై, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ రేణిగుంట గుల్బర్గా-లకు రైలు సౌకర్యం ఉంది. [18] [19] బీదరు-హైదరాబాద్ ఇంటర్-సిటీ రైలు సేవ 2012 సెప్టెంబరులో వినియోగం లోకి వచ్చింది. [20] బీదరు-యశ్వంత్పూర్ (డైలీ) ఎక్స్ప్రెస్ రైలు [21] బీదరు-ఎల్టిటి ముంబై ఎక్స్ప్రెస్ రైలు [22] నడుస్తున్నాయి. బీదరు నుండి లాతూర్ మీదుగా ముంబైకి వెళ్లే మరో రైలు వారానికి మూడు రోజులు నడుస్తోంది.
బీదరు విమానాశ్రయం దేశీయ విమాన సేవలు అందిస్తుంది బీదరు బెంగళూరు మధ్య రోజూ ఒక విమాన సర్వీసును నడుపుతుంది[23]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.