దొరలు దొంగలు (1976 సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
'దొరలు దొంగలు' తెలుగు జానపద చలన చిత్రం,1976 మే 6 న విడుదల.సుందరం మూవీస్ పతాకంపై మోహనరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కొండా సుబ్బరామదాస్.ఈ చిత్రంలో జి.రామకృష్ణ, రంగనాథ్, వాణీశ్రీ, చంద్రమోహన్, శ్రీధర్ మొదలగు తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
Remove ads
చిత్రకథ
ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదే కావచ్చు. గీతరచయిత మల్లెమాలగా చక్కటి పాటలు ఆయన ఈ చిత్రంలో అందించారు. జి. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, వాణిశ్రీ (ద్విపాత్రాభినయం) వంటి తారలతో, బాగా ఖర్చు పెట్టి నిర్మించారు. రాబిన్ హుడ్ వంటి కథానాయకుడు, రాజుగారి పేరుతో అరాచకాలు చేసే సైన్యాధికారి, యువరాణిని ప్రేమించే ఒకరాజు, యువరాణి పోలికలతో వుండే ఒక చాకలి, ఆమెను యువరాణి బదులుగా కూర్చొపెట్టటం వంటి మలుపులతో అచ్చమయిన జానపద చిత్రం లా సాగుతుంది. ఆక్షన్ చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దీనికి దర్శకుడు.
Remove ads
నటీనటులు
సాంకేతిక వర్గం
- దర్శకుడు: కె. ఎస్. ఆర్. దాస్
- కధ, చిత్రానువాదం: మల్లెమాల సుందర రామిరెడ్డి
- మాటలు, పాటలు:మల్లెమాల సుందర రామిరెడ్డి
- నేపథ్య గానం: శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల ,మాధవపెద్ది రమేష్
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- కెమెరా: కె.ఎస్.ప్రసాద్
- కళ: ఎ.కె.శేఖర్ , భాస్కరరాజు
- కూర్పు: మార్తాండ్
- నృత్య దర్శకులు: హీరాలాల్, వెంపటి సత్యం
- నిర్మాత: మోహన్ రెడ్డి
- నిర్మాణ సంస్థ: సుందరం మూవీస్
- విడుదల:06:05:1976.
పాటలు
- చెప్పలనుకున్నాను చెప్పలేక పోతున్నాను- రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి- గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- మందార మకరందమూ ఏల తేటికే సొంతం - రచన: మల్లెమాల - గానం.శిష్ట్లా జానకి
- ఓలమ్మోఓరయ్యో ..ఇయ్యాల మనకంతా పండగా ,ఏటికి నీరొచ్చింది దండిగా- రచన : మల్లెమాల - గానం . పి.సుశీల
- దొరలెవరో దొంగలేవరో తేల్చికుంటాను, తెలియకపోతే ప్రాణాలిచ్చీ తెలుసుకుంటాను - రచన: మల్లెమాల - గానం: బాలసుబ్రహ్మణ్యం
- ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది-. రచన: మల్లెమాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- తకిట తక తకిట....ఉప్పు కారం ఒకటిగా ఉన్నా- రచన: మల్లెమాల- గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
- తన్ను తన్ను తన్ను మళ్లీ మళ్లీ తన్ను- రచన: మల్లెమాల- గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- పండువెన్నెల తెల్లవార్లు కురిసి మెరిసింది- రచన: మల్లెమాల- గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పెళ్ళి అంటే మాటలు కాదోయీ శ్రీరంగచారి పెళ్ళి పెళ్లి అని- రచన: మల్లెమాల- గానం.పి . సుశీల
- వయ్యలారా బంగారు బొమ్మకు వన్నెలు పదహారు- రచన: మల్లెమాల- గానం.శిష్ట్లా జానకి, మాధవపెద్ది రమేష్ బృందం
- శ్రీరామ రామేతి రమే రామ మనోరమే సహస్ర-(శ్లోకం)- ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
Remove ads
బయటి లింకులు
- ఐ.ఎమ్.డి.బి.లో దొరలు-దొంగలు సినిమా వివరాలు.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads