ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్ఘర్ (హింది:दुमका जिला ) జిల్లా ఒకటి. దుమ్కా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లావైశాల్యం 3716 చ.కి.మీ ఉంటుంది. జిల్లా జనసంఖ్య 1,321,096.
దుమ్కా జిల్లా
दुमका जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | సంతాల్ పరగణా |
ముఖ్య పట్టణం | దుమ్కా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | దుమ్కా |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,716 కి.మీ2 (1,435 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,21,096 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (920/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 62.54 % |
• లింగ నిష్పత్తి | 974 |
Website | అధికారిక జాలస్థలి |
2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దుమ్కా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది: దుమ్కా. ఇందులో 10 బ్లాకులు ఉన్నాయి: దుమ్కా, గోపికండర్, జమ, జర్ముండి, కథికుండ్, మసిల, రాంగర్, రాణీశ్వర్, షికరిపరా, సరైయహత్.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,321,096,[2] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
న్యూహాంప్ షైర్ అమెరికాలోని.[4] | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 370 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 340 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.39%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 974:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 62.54%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
1992 దుమ్కాలో జనవరి 10న " సిద్ధు కంహు విశ్వవిద్యాలయం " స్థాపించబడింది. 2003 మే 6 న ఈ విశ్వవిద్యాలయానికి " సిదో కంహు ముర్ము విశ్వవిద్యాలయం" అని పేరు మార్చబడింది. ఈ విశ్వవిధ్యాలయం ఆధ్వర్యంలో 13 కాలేజీలు ఉన్నాయి. 1955 లో స్థాపినబడిన శాంతల్ పరగణాలు కాలేజ్, 1974లో స్థాపించబడిన ఎస్.పి మహిళా కాలేజ్ కూడా ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉంది.
దుమ్కా చాలా చిన్న పట్టణం పక్కన ఉన్న పట్టణంలో ఉన్న రహదారితో అనుసంధానమై ఉంది. 2011 జూలై న దుమ్కా కొత్తగా నిర్మించబడిన జసిధ్- దుమ్కా రైల్వే మార్గంతో అనుసంధానించబడింది. తరువాత నగరంలో 3 చక్రాల వాహనాల రద్దీ అధికమైంది. రైల్వే మార్గం ఇంకా నిర్మాణదశలో ఉన్నప్పటికీ దుమ్కా పట్టణం బీహార్ లోని భాగల్పూర్, పశ్చిమ బెంగాల్ లోని రాంపూర్హత్ లతో అనుసంధానం చేస్తుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ యాజమాన్యం నదుపుతున్న బసులే ఈ పట్టణం చేరడానికి అనువైనదని భావించవచ్చు. దుమ్కా పొరుగునా ఉన్న జిల్లాతో రహదారి మార్గంతో చక్కగా అనుసంధానించబడి ఉంది. దుమ్కా - రాంచి, కొలకత్తా ల మద్య సరికొత్తగా విలాసవంతమైన నైట్ బసు సౌకర్యం ఉంది.
దుమ్కా జిల్లాలో ఉన్న బాబా బసుకీనాథ్ ధాం దేవ్ఘర్ - దుమ్కా రాష్ట్ర రహదారి మార్గంలో ఉంది. దుమ్కాకు ఇది వాయవ్యంగా 25కి.మీ దూరంలో ఉంది. ఇది హిందువుల యాత్రాస్థలం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ బసుకీనాథ్ ఆలయం. దేశ నలుమూలల నుండి ఇక్కడి లక్షలాది మంది భక్తులు శివుని పూజించుట కొరకు ఇక్కడికి వస్తుంటారు. శ్రావణ మాసంలో విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది రాష్ట్ర రహదారిలో జిల్లా కేంద్రమైన డుంక నుండి 28 కిలోమీటర్ల్ దూరంలో ఉంది. బసుకినాథ్ రైల్వే స్టేషను అతి సమీపమైన రైల్వే స్టేషను.
బసుకినాథ్ జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో ఉంది. ఇది డియోఘర్ - దుమ్కా రాష్ట్ర రహదారిపై ఉంది. దుమ్కాకు వాయువ్యంగా 25 కిమీ దూరంలో ఉంది. ఇది హిందువులకు పుణ్యక్షేత్రం. బసుకినాథ్ ఆలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇది జసిదిహ్ దుమ్కా కొత్త రైల్వే లైన్లో ఉంది. బసుకినాథ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్హెడ్స్. రాంచీ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇది జిల్లా ముఖ్య పట్టణం దుమ్కా నుండి 24 కి.మీ దూరంలో దుమ్కా డియోఘర్ రాష్ట్ర రహదారిపై జార్మండ్ బ్లాక్ వద్ద ఉంది. ఒక సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి శివుడిని ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో అనేక దేశాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి శివుడిని ఆరాధిస్తారు.
షికరిపరా బ్లాకులో ఉన్న మాలూటి చారిత్రక, మతసంబంధిత ముఖ్య ప్రదేశాలలో ఒకటి. ఇది జిల్లాకేంద్రం దుమ్కా రాపూర్హత్ రాష్ట్ర రహదారి నుండి 55 కి.మీ దూరంలో ఉంది. రాజా బస్ంత్ రాయ్ 1860లో మలూటీని పన్ను రహిత రాజధానిగా చేసాడు. ప్రకృతి సౌందర్యం కలిగిన మలూటి పురాతత్వపరిశోధనకు, మతప్రాముఖ్యతకు కేంద్రంగా ఉంది.
సరైయహత్ బ్లాకులో ఉన్న బాబా సుమేశ్వర్ నాథ్ మత ప్రాముఖ్యత కలిగి ఉంది. జిల్లాకేంద్రం దుమ్కాకు ఇది 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది. ఇక్కడ నిత్యపూజతో శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించబడుతుంటాయి. శివరాత్రి సమయంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తుంటారు.
దుమ్కా జిల్లాలో మసంజోర్ ప్రబల విహారప్రదేశంగా గుర్తింపు పొందింది. దక్షిణ దుమ్కాకు ఈ కుగ్రామం 31కి.మీ దూరంలో ఉంది. మయూరాక్షి నదీ ద్వీపంలో ఉన్న ఈ దునదగ్రామంలో 1955లో ఇక్కడ ఆనకట్ట నిర్మించడానికి, మయూరాక్షిని అభివృద్ధి చేయడానికి కెనడా నిధులను అందించింది. అందువలన ఈ ఆనకట్టకు కెనడా ఆనకట్ట అని పేరు పెట్టారు. కొండలు, అరణ్యాల మద్య నిర్మితమైన ఈ ఆనకట్ట విహారానికి అనువైనది. మయూరాక్షి బంగ్లా, ఇంస్పెక్షన్ బంగ్లా పర్యాటకులు బసచేయడానికి అనువైనవి. రహదారి మార్గం ద్వారా మసంజోర్ Vakreshwara]] (59 కిమీ), Sainthia (50 కిమీ), తారాపిత్ (70 కిమీ), Rampurhat (62 km), Deoghar (98 కిమీ) లతో అనుసంధానమై ఉంది. అరణ్యాలతో నిండి ఉన్న రెండు పర్వతశ్రేణుల మద్య నిర్మించిన పియర్సన్ ఆనకట్ట ప్రయాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ హైడ్రాలిక్ పవర్ స్టేషను కూడా ఉంది. పర్యాటకుల కొరకు ఇక్కడ ఒక డాక్- బంగళా, పూదోట కూడా ఉంది.
టట్లోయి ఒక వేడి నీటి ఊట. జిల్లాకేంద్రం దుమ్కా నుండి 15 కి.మీ దూరంలో ఉంది. దీని చుట్టూ చిన్న కొండలు, ఆకర్షణీయమైన అందమైన పచ్చని వాతావరణం ఉన్నాయి. ఈ ఊటలోని జలం చాలా స్పష్టమైనది, ఆరోగ్యకరం.
కుంరాబాద్ చాలా అందమైన విహారప్రదేశం. జిల్లా కేంద్రం దుమ్కాకు 13 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ చిన్న కొండలతో నిండిన అతి సుందర ప్రకృతి మద్య " మయూరాక్షి నది ప్రవహిస్తుంది " .
పర్వాతళి పాకూర్ నుండి దక్షిణంగా గొడ్డా వైపు విస్తరించి ఉంది. దుమ్కా పర్వాతళి సమాంతరంగా విస్తరించి మంగళ్భంగ కొండలతో ముగుస్తుంది. దుమ్కా ఆగ్నేయంలో రాంఘర్ కొండలు సమాంతరంగా కొంచెం పశ్చిమ దిశగా విస్తరించి మసంజోర్ నుండి రాణిభల్ వరకు తూర్పు దిశగా తిరిగి ఉన్నాయి. ఈ పర్వతావళితో అక్కడక్కడా విడివిడిగా కొండలు ఉన్నాయి. నానిహత్ వద్ద టాట్లాయి వేడినీటి ఊట ఉన్న లాగ్వా కొండ, హిజ్ల కొండ, సప్చల కొండశిఖరం, చుటో పహారి, ఉన్నాయి. రాంపూర్ మార్గంలో మలుటి ఆలయ గ్రామం ఉంది.
కుర్వా (ష్రిష్టి) చిన్న విహారప్రదేశం. జిల్లాకేంద్రానికి ఇది 5కి.మీ దూరంలో ఉంది. ఇందులో ఒక అనదమైన పూదోట (పార్క్), బోటొంగ్ సౌకర్యం, ఒకచిన్న కొండ ఉన్నాయి.
చుటోనాథ్ జిల్లా కేంద్రానికి ఇంది 20 కి.మీ దూరంలో ఉంది. ఇది అందమైన విహారప్రదేశమే కాక మతప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా కూడా ఉంది. ఈ ప్రాంతం నదీతీరంలో కొండల మద్య మనోహరంగా ఉంటుంది. ఇక్కడ చుటోనాథ్ ఆలయం ఉంది.
" న్యూ లైఫ్ చర్చ్ మినిస్టర్స్ " [5] దుమ్కాకు 20 కి.మీ దూరంలో ఉంది. కటికుండ్ బ్లాకులో ప్రాంతంలో మొదటి క్రైస్తవ మిషనరీ. ఇది పెద్ద అనాథశరణాలయం ఉంది. 2005 లో స్థాపినబడిన ఈ సంస్థ 500 మంది విడిచిపెట్టబడిన, అనాథలైన గిరిజన పిల్లలకు ఆశ్రయం ఇస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 150 మంది పిల్లలు ఉన్నారు. ఈ సేవా సంస్థ ఐ.ఎస్.ఒ 9001:2008 అనుమతి పొందింది. ఈ సంస్థ ప్రాంతీయ గిరిజన పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడానికి ఈ బ్లాకులో ఒక పాఠశాలను ప్రారంభించారు.
దుమ్కా జిల్లాలో 14,356 చ.కి.మీ ప్రాంతం బిషప్ పర్యవేక్షిత ప్రాంతంగా ఉంది. షాహిబ్గంజ్, పాకూర్, జంతర (ఇందులో దేవ్ఘర్, మోహన్పూర్, శరవన్ బ్లాకులు లేవు ), పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిర్భం జిల్లాలోని రాంపూర్హత్ ఉపవిభాగాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.