క్రైస్తవ మతం యొక్క ప్రధాన వ్యక్తి From Wikipedia, the free encyclopedia
{{#ifeq:0|0|{[[:వర్గం:|వర్గం:]]}
![]() | This article has an unclear citation style. |
భాగం వ్యాసాల క్రమం |
---|
యేసు |
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
మూలాలు |
చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
బైబిల్ |
పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
క్రైస్తవ ధర్మం |
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
చరిత్ర, సాంప్రదాయాలు |
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు |
తెగలు |
క్రైస్తవ మత విషయాలు |
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
క్రైస్తవ పోర్టల్ |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరచవలసిన అంశాల గురించి చర్చపేజీలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ .శ. 26–36 వరకు) అనగా రక్షకుడు అని అర్థం[1]. నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట అంతియొకయలో యేసుక్రీస్తు వారి శిష్యులకు క్రైస్తవులు అనే పేరు పెట్టారు. ఈయన యేసు క్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు.
క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") నుండి పుట్టింది. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం. క్రీస్తు అను పేరు నాలుగు సువార్తలలో 56 పర్యాయములు క్రొత్త నిబంధన పుస్తకములలో 256 సార్లు ప్రస్తావించబడినది బైబిల్నకు కేంద్రము యేసు క్రీస్తు ప్రభువే ఆయన ఆదికాండము ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి అనగా సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు అని అని బైబిల్ తెలియజేస్తుంది యోహాను 1:1 ఆదికాండము 1:1 ఏసుక్రీస్తు ఈ లోకానికి అవతారమూర్తిగా మానవుల పాపము నిమిత్తము రాబోతున్నాడని అనేకమైన ప్రవక్తలు తెలియజేశారు.
ఆయన బెత్లెహేములో జన్మించి పోతున్నాడని మనుషుల పాపాలు హరించగల గొప్ప దైవ కుమారుడు అని అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నేను అబ్రహాము పుట్టకమునుపే ఉండాలని అని చెప్పారు యేసుక్రీస్తుకు ఉన్న నామధేయములు వాక్యము దేవుని కుమారుడు యెహోవా
యేసుక్రీస్తు గురించి పాతనిబంధన గ్రంథంలో లేదా యూదు తోరాహ్లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే చరిత్ర పై కేంద్రీకృతమై ఉంది. క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు, దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా విశ్వసిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేక్రైస్తవులు యేసుని దేవునిగా విశ్వసిస్తారు.
యేసు దైవత్వము సంబంధంచిన విద్యను క్రిస్టోలోజి అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C - Before Christ) అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D - Anno Domini, In the year of our lord) అని అంటారు.
యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు. పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్ను డిసెంబరు 25 వ తేదీన ఆనవాయితీగా జరుపుకొంటున్నారు. రోమా క్రైస్తవులు సుమారు సా.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మత్తయి, మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది. మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి. యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన దావీదు, అబ్రహాము.
క్రీస్తు జన్మ గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను,, క్రీస్తు కాలంలో వ్రాయబడిన క్రొత్త నిబంధనలోను పలు చోట్ల ప్రస్తావించబడింది. ముఖ్యముగా క్రీస్తు పూర్వం, అనగా 700 B.C లో ప్రవక్త యోషయా 7:14 తన గ్రంథంలోని 7:14 లో యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రవచించడం గమనార్హం. అలాగే యోషయా 53 వ అధ్యాయం కూడా యేసు ప్రభువు గురించి ప్రరోక్షంగా ప్రవచించడం విశేషం.[citation needed]
యోషయా మరణించిన 700 సంవత్సరాల తర్వాత ఏసు బెత్లహేము అను గ్రామంలో యోసేపు, మరియ దంపతులకు జన్మించడం జరిగింది. బైబిలు ప్రక్రారం కన్యక యైన మరియకు స్వప్నంలో దేవదూత యేసు జన్మము గురించి మత్తయి, లూకా సువార్తలలో చెప్పడం జరిగింది. యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు. (మత్తయి|13:55).
'బాప్తీస్మము'
యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం. యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు. "తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడిందని మత్తయి సువార్తలో కనిపిస్తుంది.
యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.
యేసు క్రీస్తు శిలువయాగం గురించి బైబిలులో పలుచోట్ల ప్రవచించబడింది, ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 16: 21 - 28, మత్తయి 20: 17 - 19, లూకా సువార్త 9:22, మార్కు సువార్త 9:30 లో యేసు క్రీస్తు ప్రవచించడం కనిపిస్తుంది. యేసు క్రీస్తును ఇస్కరియేతు యూదా అను వ్యక్తి పిలాతు అను రాజుకు అప్పగించండం, యేసుక్రీస్తు శిలువయాగం ప్రస్తావన మత్తయి 26, 27, మార్కు 14, 15, యోహాను 18, 19 అధ్యాయాల్లో కనిపిస్తుంది.
పునరుద్ధానం అనగా క్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. కేధలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వారు జరుపుకునే శిలువధ్యానాలు (Lent Days) భస్మ బుధవారం (Ash wednesday) తో ఆరంభమై ఈస్టర్ రోజుతో ముగిస్తుంది.
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
This article needs additional citations for verification. |
యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది..
ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు.
This article needs additional citations for verification. |
Seamless Wikipedia browsing. On steroids.