భారతీయ వ్యాధివిజ్ఞాన శాస్త్రజ్ఞుడు From Wikipedia, the free encyclopedia
వులిమిరి రామలింగస్వామి (ఆగష్టు 8, 1921 - మే 28, 2001) ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు.
వులిమిరి రామలింగస్వామి V. Ramalingaswami | |
---|---|
జననం | ఆగష్టు 8, 1921 ఆంధ్ర ప్రదేశ్ |
మరణం | మే 28, 2001 |
పౌరసత్వం | భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
జాతి | హిందూ |
రంగములు | పాథాలజీ |
వృత్తిసంస్థలు | అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ |
చదువుకున్న సంస్థలు | ఆంధ్ర వైద్య కళాశాల |
ప్రసిద్ధి | రోగ నిదాన శాస్త్రవేత్త |
రామలింగస్వామి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళంలో 1921, ఆగష్టు 8 వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గుంపస్వామి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్ ఆ తర్వాత ఎం.డి చదివారు. బ్రిటన్ దేశం వెళ్ళీ ఆక్స్ఫర్డు యూనివర్శిటీలో డి.ఫిల్, డి.ఎస్.సి పట్టాలను పుచ్చుకొన్నారు.[1]
వైద్య శాస్త్రంలో కీలకరంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన తొలుత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పాథాలజిస్ట్ గా (1947-54) పనిచేశారు. డిప్యూటీ డైరక్టర్ పదోన్నతి పొంది మూడు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించారు. 1954 లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రవేశించి పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండి, తమ ప్రతిభాసంపన్నతను చూపారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా రాణించారు.
ప్రొఫెసర్ రామలింగస్వామి రోగ నిదాన శాస్త్రం అభివృద్ధికి అంకిత భావంతొ ఎనలేని సేవలు అందించారు. మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో యువ ప్రాయానికి ఎదుగుతున్న పిల్లల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధులకు కారణమైన ప్రోటీన్, కాలరీ పోషకాహార లోపం (శరీర కణజాలములకు తగిన మాంసకృత్తులు, శక్తి ప్రమాణములు లోపించుట) అంశం మీద ఉన్నత స్థాయి అధ్యయనాలు, ప్రయోగాలు చేసి పరిష్కార మార్గాలు తెలిపారు. ఈయన పరిశోధనా ఫలితాల ద్వారా ప్రోటీన్ లు, కాలరీల లోపం వలన మానవ శరీరం ఎంతగా ప్రతిస్పందిస్తుందో అవగాహనకు రావడం జరిగింది. పోషకాహార లోపములకు సంబంధించిన పాథోఝికియాలజీ అంశం మీద సుదీర్ఘ పరిశోధనలు జరిపారు హిమాలయన్ ఎండెమిక్ గొయిత్రి (హిమాలయ ప్రాంతంలో ఎల్లప్పుడూ ప్రబలి ఉంచే గొంతు కణితి (థైరాయిడ్ గ్రంథి పెరుగుట) వ్యాధి) కు కారణాలు అన్వేషించి, పరిష్కార మార్గాలు తెలిపారు. అయొడైజ్డ్ ఉప్పు వాడకాన్ని అమలు చేయటమే ఈ తరహా వ్యాధులకు పరిష్కారమని తొలిసరిగా నిర్దేశించారు. ఈయన తమ పరిశోధనలన్నిటి ఆధారంగా 140 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. వైద్య శాస్త్రానికి సంబంధించిన పలు ప్రామాణిక గ్రంథాలలో కొన్ని అధ్యాయాలను రచించారు. ఈయన మేథా సంపత్తికి, పరిశోధనా ఫలితాలకు దేశ విదేశాలలో నీరాజనాలందాయి.
Seamless Wikipedia browsing. On steroids.