1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు
భారతదేశంలో అల్లర్లు / From Wikipedia, the free encyclopedia
1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు లేదా 1984 సిక్ఖుల ఊచకోత లేదా 1984 సిక్ఖులపై మారణహోమం అన్నది సిక్ఖు వ్యతిరేక గుంపులు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు, సిక్ఖు అంగరక్షకుల చేతిలో జరిగిన ఇందిరా గాంధీ హత్యకి ప్రతీకారంగా సిక్ఖులకు వ్యతిరేకంగా సాగిన హింసాయుత చర్యల వరస.[1][2][3][4][5][6] లూటీలు, గృహదహనాలు, హత్యలు, ఆలయ విధ్వంసాలు వంటి అనేక చర్యలకు ఈ అల్లర్లలో విద్రోహ మూకలు పాల్పడ్డాయి. దేశవ్యాప్తంగా 2800 మంది సిక్ఖులు అల్లర్లలో మరణించగా, అందులో 2100 మరణాలు ఢిల్లీలోనే జరిగాయి.[3][7] ఈ దాడుల గురించి ఇందిరా గాంధీ మరణం తర్వాత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజీవ్ గాంధీని ఈ దాడుల గురించి ప్రశ్నించగా "పెద్ద చెట్టు కూలిపోతే, చుట్టూ ఉన్న భూమి కంపిస్తుందం"టూ వ్యాఖ్యానించారు.[8] ఆయన వ్యాఖ్య పలు విమర్శలకు గురైంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/ca/Sikh_man_surrounded_1984_pogroms.jpg/320px-Sikh_man_surrounded_1984_pogroms.jpg)