ఆగస్టు 3: రెండవ కర్ణాటక యుద్ధం: బ్రిటిషు మద్దతు ఉన్న ఆర్కాటు నవాబుకూ 77 ఏళ్ల అన్వరుద్దీన్ ఖాన్ కూ, ఫ్రెంచ్-మద్దతు ఉన్న చందా సాహిబ్ దళాలకూ మధ్య అంబూరు పోరు మొదలైంది. కోట గోడ దాటి వెలుపలికి వచ్చి చందా సాహిబ్ సైన్యంతో చేసిన యుద్ధంలో నవాబు ఓడిపోయాడు. యుద్ధంలో అతడు హతుడయ్యాడు. [1]
ఆగష్టు 15–ఆర్కిటిక్ మహాసముద్రం ద్వీపమైన ఎడ్జియాలో ఆరు సంవత్సరాలకు పైగా చిక్కుకుపోయిన రష్యన్ నావికులు-అలెక్సీ ఇంకోవ్, క్రిసాన్ఫ్ ఇంకోవ్, స్టెపాన్ షరపోవ్, ఫెడోర్ వెరిగినే లను రక్షించారు. 1743 మేలో మంచు తాకిడికి వాళ్ళ పడవ ఛిన్నమై పోయినపుడు మొత్తం 14 మంది సిబ్బందిలో వారు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. [2] ఈ నలుగురు సెప్టెంబరు 28 న ఇంటికి తిరిగి వచ్చారు. నాలుగో వ్యక్తి, ఫెడోర్ వెరిగినే, స్కర్వీ వ్యాధితో దారి లోనే మరణించాడు
నవంబర్ 12: ఫ్రాన్స్లో ఆకలితో అలమటించే గ్రామీణులు పారిస్కు తరలిరాకుండా ఉండేందుకు గాను, కింగ్ లూయిస్ XV ఒక ఆర్డినెన్స్ జారీ చేసాడు: "పారిస్ వీధుల్లో, చర్చిలలో, చర్చి ద్వారాల వద్దా, పారిస్ శివార్లలో ఉండే గ్రామీణ ప్రాంతాలలోనూ కనిపించే బిచ్చగాళ్ళను ఏ వయస్సు వారైనా, ఏ లింగమైనా సరే అరెస్టు చేసి జైళ్లలో పెట్టాలి. ఎంత కాఅలం అవసరమైతే అంత కాలమూ అక్కడే ఉంచాలి. " [3][4]
"Child Abduction Panic", in Outbreak!: The Encyclopedia of Extraordinary Social Behavior, ed. by Hilary Evans and Robert E. Bartholomew (Anomalist Books, LLC, 2009) pp83-84