From Wikipedia, the free encyclopedia
హిందూమత చరిత్ర అనేక హిందూ సంప్రదాయాల, బిన్న సంస్క్రతుల మీద ఆదారపడింది.ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్, భారతదేశం పై ఆదారితమైనవి.[1] హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిచాటుతుంది. హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది.[note 1] పండితులు హిందూ మతాన్ని భారతదేశం అనేక సంప్రదాయాలు, బిన్న సంస్క్రతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పపడిందిగా పరిగణిస్తారు.[11][12][13] [12][14][11][15][16][note 2]
హిందూ మత చరిత్ర అనేక దశలుగా విభజించబడింది ఇందూలో మొదటిది వేద కాలం అంటే సుమారు (సా.శ.పూ. 8000) సంవత్సరములు.సుమారు సా.శ.పూ. 2000, 500 సంవత్సరములు సమయంలో హిందూ మతాన్ని వేదకాలానికి, హిందూ ధర్మాన్ని మధ్య మలుపు తిప్పిన కాలం.ఈ కాలంలోనే హిందూ మతం, బౌద్ద మతం, జైన మతాలు విరసిల్లాయి.[17] (సా.శ.పూ. 200 నుండి సా.శ. 500 ) కాలాన్ని పురానాల కాలంగా పిలువబడుతుంది గుప్త సామ్రాజ్యము కాలంతో మమేకం అయిన ఈ కాలాం హిందూమత చరిత్రలో సువర్ణకాలంగా వ్యవహరించబడింది.ఈ కాలంలోనే సమాఖ్య, యోగా, న్యయ, వైశేషిక, మిమాంస,, వేదాంత అనే ఆరు హిందూ వేదాంతశాస్త్రాలు ఉద్భవించాయి. ఈ కాలంలోనే శైవులు, వైష్ణవులు ఏర్పడ్డారు. సా.శ.పూ. 800 నుండి సా.శ. 532 మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది.ఈ కాలంలోనే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఉద్బవించింది.
ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుంది.బ్రిటిషు పరిపాలనా సమయంలో పాశ్చాత దేశాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకోని అనేక ఉద్యమాలు జరిగి 1947 లో స్వాతంత్ర్యంతో హిందూ మేజారిటి దేశంగా ఉద్బవించింది.ప్రవాస భారతీయుల కారణంగా 20 వ శతాబ్దంలో అనేక ఖండాలలో ముఖ్యంగా అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్లో హిందూవుల సంఖ్య పెరిగింది.1980 కాలంలో హిందూ దేశికరణ ఒక గోప్ప శక్తి రూపంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది.1999 నుండి 2004 వరకు తిరిగి 2014 లో అధికారం సాగించింది. అట్లాగే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 2006 లో రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం చాలా వేగంగా వ్యాపిస్తోంది.
జెమ్స్ మిల్ల్ (1773–1836), తాను రచించిన The History of British India (1817, [lower-alpha 1] అనే పుస్తకంలో భారతదేశ చరిత్రను మూడు విభాగాలుగా వివరించాడు అవి హిందూ, ఇస్లాం, బ్రిటీషు పరిపాలనా [lower-alpha 2][lower-alpha 3] ఈ సిద్ధాంతం ఆమోదించబడింది కాని కొంత వ్యతిరేకత కూడా వచ్చింది.[lower-alpha 4] ఇంకో సిద్ధాంతం ప్రకారం పూర్వ, సాంస్క్రతిక, మధ్య,, ఆధునిక కాలం.[lower-alpha 5] | |||||||||||||
స్మార్ట్[lower-alpha 6] | మైఖేల్స్ (మొత్తం) [lower-alpha 7] |
మైఖేల్స్ (వివరణాత్మకం) [lower-alpha 8] |
మూస్సే[lower-alpha 9] | ఫ్లడ్[lower-alpha 10] | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సింధు లోయ నాగరికత, వేద కాలం (c. 3000–1000 BCE) |
పూర్వ వేద మతాలు (until c. 1750 BCE) [lower-alpha 11] |
పూర్వవేద మతాలు (until c. 1750 BCE) [lower-alpha 12] |
సింధు లోయ నాగరికత (3300–1400 BCE) |
సింధు లోయ నాగరికత (c. 2500 to 1500 BCE) | |||||||||
వేద మతాలు (c. 1750–500 BCE) |
ప్రారంభ వేద కాలం (c. 1750–1200 BCE) |
వేద కాలం (1600–800 BCE) |
వేద కాలం (c. 1500–500 BCE) | ||||||||||
మధ్య వేదకాలం (from 1200 BCE) | |||||||||||||
పూర్వ సాంస్క్రతిక కాలం (c. 1000 BCE – 100 CE) |
మలి వేద కాలం (from 850 BCE) |
మహాజనపదాలు (600–300 BC), సాంస్క్రతిక కాలం (800–200 BCE) | |||||||||||
సంస్కరణావాదం (తపస్వి) (c. 500–200 BCE) |
సంస్కరణావాదం (తపస్వి) (c. 500–200 BCE) |
ఇతిహాసం, పౌరాణిక కాలం (c. 500 BCE to 500 CE) | |||||||||||
సాంస్క్రతిక హిందూ మతం (c. 200 BCE – 1100 CE) [lower-alpha 13] |
ప్రారంభ సాంస్క్రతిక హిందూ మతం (c. 200 BCE – 300 CE) [lower-alpha 14] |
ఇతిహాసం, పౌరాణిక కాలం (200 BCE – 500 CE) | |||||||||||
సాంస్క్రతిక కాలం (c. 100 – 1000 CE) |
"స్వర్ణ యుగం" (గుప్త సామ్రాజ్యము) (c. 320–650 CE) [lower-alpha 15] | ||||||||||||
దిగువ సాంస్క్రతిక కాలం (700–1200 AD) |మలి సాంస్క్రతిక కాలం (c. 650–1100 CE) [lower-alpha 16] |
మధ్య, దిగువ పౌరాణిక కాలం (500–1500 CE) |
మధ్య, దిగువ పౌరాణిక కాలం (500–1500 CE) | |||||||||||
హిందూ-ఇస్లాం నాగరికతలు (c. 1000–1750 CE) |
ఇస్లాం పరిపాలన, హిందూ మతం పెత్తనాధికారం (c. 1100–1850 CE) [lower-alpha 17] |
హిందూ పెత్తనాధికారం, ఇస్లాం పరిపాలనా (c. 1100–1850 CE) [lower-alpha 18] | |||||||||||
ఆధునిక కాలం (1500–present) |
ఆధునిక కాలం (c. 1500 CE to present) | ||||||||||||
ఆధునిక కాలం (c. 1750 CE – present) |
నవీన వేదాంతం (from c. 1850) [lower-alpha 19] |
నవీన వేదాంతం (ఆధునిక హిందూ మతం) (from c. 1850) [lower-alpha 20] | |||||||||||
| |||||||||||||
శాస్త్రీయంగా ఆధునిక మానవులు సూమారు 75,000 నుండి 60,000 సంవత్సరాలకు పూర్వం ప్రాచీన శిలా యుగంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు.[18][19] వీరు ఆష్ట్రేలోయ్డ్స్.[web 1] వారు చాలావరకు కనుమరుగైయ్యారు లేదా కొంత మంది మనుగడ సాగించారు.[20]
ఆష్ట్రేలోయ్డ్స్ తరువాత సా.శ.పూ. 6000 నుండి 4000 కాలంలో ఎలమో - ద్రవీడీయన్లు వచ్చారు.[21] [22] BCE) తరువాత ఇండో - ఆర్యులు (సా"శ"పూ 2000 నుండి 1500) [23][24]),, మన్గోలియాయ్డ్స్, సైనో - టిబెటన్లు భారతదేశానికి వలస వచ్చారు.ఎలమో - ద్రవీడియన్లు ఎలమో ప్రాంతం (ఇరాన్) నుండి [note 3][21][22][25][note 4], టిబెటో - బర్మన్లు ఉత్తర తూర్పు హిమాలయాల నుండి వలస వచ్చారు.[note 5]
పూరాతన భారతదేశ మతం (హిందూ మతం) దాని ఉనికిని ప్రాచీన శిలా యుగానికి చెందిన భీమ్బేట్కా శిలా గుహలులో కనబరుస్తుంది.[note 6]భీమ్బేట్కా శిలా గుహలులో ఉన్న అనేక చిత్రాలు వేద కాలం నాటి శివుడిని పోలి ఉంటాయి.కాని ఇతర దేవుళ్ళ చిత్రాలు కనబడవు.[26][27][28] ఇవి సూమారు సా.శ.పూ. 30,000 సంవత్సరాలకు చెందినవి.అట్లాగే నవీన శిలా యుగం లేదా నియోలిథిక్ కాలంలో కూడా దాని ఉనికి చాటింది.[note 7]హిందూ మతంలో మరి కొన్ని ఆచారాలు 4000 BCE కాలం నాటివి. [web 2] హిందూ మతం దక్షిణ ఆసియాలో లిపి పుట్టకముందు నుండే దాని ఉనికిని చాటింది.
కొన్ని హిందూ, ఇతర హిందూ ఉప మతాలలో ఉపయోగించిన స్వస్తిక్ ముద్రికల సింధు నాగరికత పట్టణాలలో దోరికాయి. సింధు నాగరికత పట్టణాలైన హరప్ప, కాళిబంగన్ లో అనేక శివ లింగాలు లభించాయి. తరువాతి కాలంలో ఇవి హిందూ మతంలో పూజించబడుతున్నాయి.[29][30]
అనేక జంతువుల ముద్రికలు సింధు నాగరికతలో ఉపయోగంచుట జరిగింది. సింధు లోయ నాగరికత నగరమైన మోహన్ జోదారోలో స్టియాలైట్ తో తయారు చేయబడిన పశుపతి ముద్రిక కనుగోనబడింది. ఒక వేదికపై కూర్చున్న మూడు ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం, జింక ఉన్నాయి.ఈ ముద్రిక కోంతమేరకు దెబ్బతిని ఉంది.ఈ ముద్రికలో గల ప్రతిమకు ముడు తలలు కలిగి ఉన్నాయి.పశుపతి కోమ్ముల కలిగి చూట్టు పశువులతో అలంకరించబడ్డాడు. ఇతడు ఒక కోమ్ముల కలిగిన దేవతామూర్తి. ఇతడిని హిందూ మతంలో పూజించే శివుని రూపంగా భావిస్తారు.[31][32][33]
1997లో డోరిస్ మెత్ శ్రీనివాసన్ ప్రకరాం పశుపతి ముద్రిక ఒక మగ మహిష దేవుడు అని అభిప్రాయపడ్డారు.[34]
ఐరావతం మహదేవన్ రచించిన The Indus Script: Texts, Concordance and Tables (1977), అనే పుస్తకంలో 47, 48 గుర్తులను దక్షిణ భారత దేవతా మూర్తైన మురుగున్ లేదా కుమారస్వామి అని వర్ణించాడు.[35] అనేక పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు.ఆ ఆరాధన నేటికి హిందూ మతంలో కోనసాగుతునే ఉంది.[36]
సింధు నాగరికత భవంతులలో ఏరకమైన దేవాలయాలు కనుగోనలేదు.ఒకవేల ఉంటే వాటిని కనుగోనాల్సివుంది.[37] ఏమైనప్పటికి మోహంజోదారో దిగువ పట్టణం లోని HR-A ప్రాంతం House - 1 ని దేవాలయంగా గుర్తించారు.[38]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.