శ్రీలంక ఆర్థిక సంక్షోభం
2019 నుండీ శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం / From Wikipedia, the free encyclopedia
శ్రీలంకలో 2019 లో [8] ప్రారంభమై 2022 లోనూ కొనసాగుతున్న సంక్షోభమే శ్రీలంక ఆర్థిక సంక్షోభం. 1948 లో [8] స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఆ దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇది. దీనివల్ల మున్నెన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు దాదాపుగా ఖాళీ అవడం, వైద్య సామాగ్రి కొరత, ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదల వంటి పర్యవసానాలు తలెత్తాయి. [9] విపరీతంగా నోట్ల ముద్రణ, సేంద్రియ లేదా జీవ వ్యవసాయానికి మారడానికి తీసుకొచ్చిన దేశవ్యాప్త విధానం, 2019లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి బహుళ కారణాల వల్ల ఈ సంక్షోభం ప్రారంభమైంది. ఈ ఆర్థిక కష్టాలు 2022 లో ప్రజల నిరసనలకు దారితీసాయి.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం (2019 నుండి -) | |||
---|---|---|---|
తేదీ | 2019 ఏప్రిల్ — జరుగుతోంది (5 సంవత్సరాలు, 1 వారం , 3 రోజులు) | ||
స్థలం | శ్రీలంక | ||
కారణాలు |
| ||
స్థితి | జరుగుతోంది | ||
జననష్టం | |||
2022 మార్చి నాటికి దేశంలో మిగిలి ఉన్న 1.9 బిలియను అమెరికా డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2022 లో దేశం చెల్లించాల్సిన 4 బిలియన్ల డాలర్ల విదేశీ రుణాల చెల్లింపులకు సరిపోవు. దీంతో శ్రీలంకను సావరిన్ ఎగవేతదారుగా గుర్తించారు. [10] 2022 జూలైలో 1 బిలియను డాలర్ల అంతర్జాతీయ సావరిన్ బాండ్ ను కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2022 లో శ్రీలంక మొత్తం 8.6 బిలియను డాలర్ల ఋణ చెల్లింపులు చెయ్యాల్సి ఉందని బ్లూమ్బెర్గ్ చెప్పింది. ఇందులో స్థానిక రుణాలు, విదేశీ రుణాలు రెండూ కలిసి ఉన్నాయి. [11] [12] తాము అప్పులను తీర్చలేమని శ్రీలంక ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో ప్రకటించింది. దీంతో, 1948 లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంక చరిత్రలోనే మొట్టమొదటి సారి సార్వభౌమ ఎగవేతదారుగా, 21వ శతాబ్దంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సార్వభౌమ ఎగవేతదారుగా మారిన మొదటి దేశంగా నిలిచింది. [13] [14]
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిత్యావసరాలకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందనీ 2022 జూన్లో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పార్లమెంటులో ప్రకటించాడు. [15]