వి. పి. మెనన్
భారతీయ ప్రభుత్వోద్యోగి / From Wikipedia, the free encyclopedia
వప్పల పంగుణ్ణి మెనన్ (1893 సెప్టెంబరు 30 - 1965 డిసెంబరు 31) భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. ఆయన భారతదేశపు ఆఖరి ముగ్గురు వైశ్రాయ్ లకు రాజ్యాంగ సలహాదారుగానూ[1], రాజకీయ సంస్కరణల కమిషనర్ గానూ పనిచేశారు. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి బ్రిటీష్ ఇండియాకు స్వతంత్రం రావడంలో అత్యంత కీలకమైన అధికార బదిలీలోని భారత విభజన, భారత స్వాతంత్ర్య చట్టం, భారతదేశ ఏకీకరణ, భారత రాజ్యాంగ రచన వంటి అంశాల్లో బ్రిటీష్ ప్రభుత్వానికి, కొత్తగా ఏర్పడిని భారత ప్రభుత్వానికి సహకరిస్తూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.[2]
త్వరిత వాస్తవాలు వి. పి. మెనన్V.P. Menon, జననం ...
వి. పి. మెనన్ V.P. Menon | |
---|---|
![]() | |
జననం | (1893-09-30)1893 సెప్టెంబరు 30 Ottapalam, కేరళ |
మరణం | 1965 డిసెంబరు 31(1965-12-31) (వయసు 72) |
జాతీయత | Indian |
వృత్తి | Civil servant |
మూసివేయి