మిరపకాయ
From Wikipedia, the free encyclopedia
మిరపకాయ నాహూటల్ చిల్లీ నుంచి ఉద్భవించిన ఈ పదాన్ని చిల్లీ పెప్పర్, చిల్లి అని కూడాసంభోదిస్తుంటారు. ఇది సొలనేసి కుటుంబం, మిరప కాప్సికమ్ తరగతికి చెందిన మొక్కలకు కాచే కాయ[1].
మిరపకాయలనేవి మొదట అమెరికాలోవెలుగుచూశాయి. అమెరికాలో యూరోపియన్లు కాలిడిన తర్వాత, మిరపకాయలకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో పాటు ఆహారం, ఔషధాల తయారీల్లో ఉపయోగించడం ప్రారంభమైంది. భారతదేశంలో గుంటూరు, పరిసరజిల్లాలు మిరపపంటకు ప్రసిద్ధి. ఈ పంట డిసెంబరు నుండి మే వరకు కోతలు వుంటాయి. భారత మసాల మండలి ప్రకారం సంవత్సరానికి 2,80,000 టన్నుల [2] పంట పండుతున్నది. ఇంకా ఇతర రకాలు దేశంలో పలు చోట్ల ప్రసిద్ధికెక్కాయి.
మిరపకాయలు ఘాటుగా వుంటాయి. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. మిరప పండ్లను తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించడం జరుగుతోంది.దీనిని సుదీర్ఘకాలం పాటు నిల్వచేయడానికి వీలుగా వాటిని ఎండబెట్టడం జరుగుతోంది. అలాగే తాజా మిరప పండ్లను ఊరగాయ వేయడం ద్వారా కూడా దీర్ఘకాలం నిల్వచేయడం జరుగుతోంది. మిరపకాయలను వంటలలో, వైద్యపరంగా, రక్షణకు, మనస్సుని దిటవు పరచుకోటానికి, ఆహర పరిరక్షణకు, ఆత్మ రక్షణకు వాడుతారు.