![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c8/Badshahi_Mosque_front_picture.jpg/640px-Badshahi_Mosque_front_picture.jpg&w=640&q=50)
బాద్షాహీ మసీదు
From Wikipedia, the free encyclopedia
బాద్షాహీ మసీదు ( పంజాబీ, Urdu: بادشاہی مسجد , లేదా "ఇంపీరియల్ మసీదు") అన్నది పాకిస్తాన్కు చెందిన పంజాబ్ ప్రావిన్సుకు రాజధాని ఐన లాహోర్ నగరంలో నెలకొన్న మొఘల్ కాలానికి చెందిన మసీదు.[1] ఈ మసీదు లాహోర్ కోటకు పశ్చిమాన కోటగోడల్లోపలి నగర భాగపు (వాల్డ్ సిటీ ఆఫ్ లాహోర్గా పేరొందింది) శివార్లలో ఉంది[2] లాహోర్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఒకటిగా దీన్ని పలువురు పరిగణిస్తారు.[3]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c8/Badshahi_Mosque_front_picture.jpg/640px-Badshahi_Mosque_front_picture.jpg)
బాద్షాహి మసీదును ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిర్మించాడు. 1971లో ప్రారంభమైన ఈ మసీదు నిర్మాణం 1673 వరకు రెండేళ్ల పాటు కొనసాగింది. ఈ మసీదు మొఘల్ నిర్మాణ శైలికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. బయటి భాగాన్ని పాలరాయి పొదిగి చెక్కిన ఎర్ర ఇసుకరాయితో అలంకరించారు. ఇది మొఘల్ కాలానికి చెందిన అతిపెద్ద మసీదు. అలానే నేడు పాకిస్తాన్లోకెల్లా రెండవ అతిపెద్ద మసీదు .[4] మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, ఈ మసీదును సిక్కు సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం ఒక సైనిక శిబిరంగా ఉపయోగించాయి. ప్రస్తుత కాలంలో పాకిస్తాన్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన సాంస్కృతిక ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.