పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన పరిపాలనా అధికార సంస్థ, ఇది జాతీయ రాజ్యాంగం ద్వారా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలతో చట్టబద్ధమైనదిగా రూపొందించబడింది.[1] గవర్నరు రాష్ట్రానికి అధిపతిగా వ్యవహరిస్తారు. గవర్నరుకు రాష్ట్ర కార్యనిర్వాహక అధికారంపై నామమాత్రపు అధికారం ఉంటుంది. ముఖ్య కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వ అధిపతి ముఖ్యమంత్రికి ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత.ముఖ్యమంత్రికి కార్యనిర్వాహక అధికారాలు చాలా వరకు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఉంది. రాష్ట్ర రాజధానికి ఆనుకుని హౌరా జిల్లాలోని నబన్న భవనంలో తాత్కాలిక సచివాలయం ఉంది. కలకత్తా హైకోర్టు కోల్కతాలో ఉంది. కలకత్తా హైకోర్టుకు పశ్చిమ బెంగాల్ మొత్తం రాష్ట్రంపై, ఇంకా కేంద్రపాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబార్ దీవులపై అధికార పరిధిని కలిగి ఉంది.
State | West Bengal |
---|---|
దేశం | India |
చట్ట వ్యవస్థ | |
Assembly | |
Speaker | Biman Banerjee (AITC) |
Deputy Speaker | Dr. Asish Banerjee (AITC) |
Members in Assembly | 294 |
సభాస్థానం | Bidhan Sabha Bhavan, Kolkata |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
Governor | C. V. Ananda Bose |
Chief Minister | Mamata Banerjee (AITC) |
Chief Secretary | Bhagwati Prasad Gopalika, IAS |
Headquarters | Nabanna, Howrah |
Departments | 54 |
Judiciary | |
High Court | Calcutta High Court |
Chief Justice | Justice T. S. Sivagnanam |
పశ్చిమ బెంగాల్ ప్రస్తుత శాసనసభ ఏకసభ్యమైనది. ఇందులో ఒక ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి నామినేట్ చేయబడిన సభ్యునితో కలుపుకుని 294 మంది శాసనసభ సభ్యులు (ఎం.ఎల్.ఎ) [2] ఉన్నారు. ఏదేని పరిస్థితులలో గవర్నరు మధ్యలో రద్దు చేయకపోతే దీని పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది.
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టికి ప్రధాన నాయకురాలుగా కొనసాగుచున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 2011 మే 20న పదవీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో 184 సీట్లు (294 లో), 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో 211 సీట్లు (294 లో) 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో 215 సీట్లు, (294లో) గెలుచుకున్న