గీతాంజలి (కవిత)
From Wikipedia, the free encyclopedia
రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.
- రవీంద్రనాథ ఠాగూర్ గారు బెంగాలి లో రచించిన గీతాంజలి కవితను చలం (గుడిపాటి వెంకట చలం) గారు తెలుగు లోనికి అనువదించారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/e/e7/Gitanjali_title_page_Rabindranath_Tagore.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/1/13/Chalam1.jpg/640px-Chalam1.jpg)