ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికలు - 2014
From Wikipedia, the free encyclopedia
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలంగాణా అపాయిమెంట్ తేదీ 2014 జూన్ 2 అయినందున ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు రెండు విడతలుగా జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలు, ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు.
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి మార్చి 10, 2014 న వెలువరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో పార్టీల ప్రాతిపదికన ఒకే దశలో ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తారు. జిల్లాల్లో 2014 మార్చి17 న కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్ వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం |