సిమ్లా ఒప్పందం
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్, పాకిస్తాన్ను ఓడించాక రెండు దేశాల మధ్య కుదిరిన సంధి ఒప్ / From Wikipedia, the free encyclopedia
1914 సిమ్లా ఒప్పందం తో తికమక పడరాదు.
సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరింది.[1] 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత ఈ సంధి కుదిరింది. ఈ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలువబడే భూభాగం పాకిస్తాన్నుండి వేరుపడి బంగ్లాదేశ్గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్తి యుద్ధంగా మొదలైన ఈ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కు బాసటగా దిగడంతో ఇది భారత పాకిస్తాన్ యుద్ధంగా మారింది. సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, భవిష్యత్తులో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.[2]