షిర్డీ సాయిబాబా
From Wikipedia, the free encyclopedia
షిర్డీ సాయిబాబా (సెప్టెంబరు 28, 1856 - అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు.ఇతని వ్యాఖ్యలలో ముఖ్యమైనది "శ్రద్ద ఇంకా సబూరి" ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
షిరిడీ సాయిబాబా | |
---|---|
గురువు | వెంకూసా |
తత్వం | అద్వైతం |
ఉల్లేఖన | శ్రద్ద ఇంకా సబురి |
సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.దేశవ్యాపౖంగా సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.