శాతకర్ణి
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని దక్కను ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహన రాజులలో శాతకర్ణి (మొదటి శాతకర్ణి బ్రాహ్మి లిపి: 𑀲𑀸𑀢𑀓𑀡𑀺, సాతకసి) మూడవవాడు. ఆయన పాలన సాధారణంగా క్రీ.పూ 70-60 నాటిది.[2] అయినప్పటికీ కొంతమంది రచయితలు క్రీస్తుపూర్వం 187-177 మధ్యకాలానికి చెందిన వాడని పేర్కొన్నారు.[3]