వైస్రాయి కార్యనిర్వాహక మండలి
From Wikipedia, the free encyclopedia
వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనేది భారత వైస్రాయ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ మంత్రివర్గం. దీనిని ఇంగ్లీషులో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనీ, కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. [1] ఇది 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో వ్యవస్థకు గుర్తింపునిస్తూ, సలహా మండలి నుండి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా రెవెన్యూ, మిలిటరీ, లా, ఫైనాన్స్, హోమ్ వంటి ఐదుగురు సభ్యులతో కూడిన క్యాబినెట్గా రూపాంతరం చెందింది. 1874లో, పబ్లిక్ వర్క్స్కు ఇన్ఛార్జ్గా ఆరవ సభ్యుడుగా చేర్చారు.