![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Heliodorus-Pillar2.jpg/640px-Heliodorus-Pillar2.jpg&w=640&q=50)
విదిశ
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పురాతన పట్టణం / From Wikipedia, the free encyclopedia
విదిశ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్కి ఈశాన్యంగా 62.5 కి.మీ. దూరంలో ఉంది "విదిశ" అనే పేరు పురాణాలలో పేర్కొన్న "బైస్" నది నుండి వచ్చింది.[1] ఈ పట్టణాన్ని పూర్వం భెల్సా అని పిలిచేవారు. పురాతన కాలంలో బెస్నగర్ అని దీనికి పేరు.
త్వరిత వాస్తవాలు విదిశ భెల్సా, దేశం ...
విదిశ
భెల్సా | |
---|---|
పట్టణం | |
![]() హీలియోడోరస్ స్థంభం | |
Coordinates: 23.53°N 77.82°E / 23.53; 77.82 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | విదిశ |
Elevation | 424 మీ (1,391 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,55,959 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Vehicle registration | MP-40 |
మూసివేయి
1904 లో విదిశ, బసోడా తహసీళ్ళను కలిపి ఈ జిల్లాను "భిల్సా జిల్లా"గా ఏర్పాటు చేసారు. అంతకుముందు అవి గ్వాలియర్ సంస్థానంలో భాగంగా ఉండేవి. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, పూర్వపు సంస్థానమైన గ్వాలియర్ 1948 లో ఏర్పడిన మధ్య భారత్ రాష్ట్రంలో భాగమైంది.
మధ్యయుగ కాలంలో విదిశ, భెల్సాకు పాలనా కేంద్రంగా ఉంది. 1956 లో దీని పేరును విదిశ అని మార్చారు.[2]