![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/India_Vidarbha_locator_map.svg/langte-640px-India_Vidarbha_locator_map.svg.png&w=640&q=50)
విదర్భ
From Wikipedia, the free encyclopedia
విదర్భ, అనేది భారతదేశం, మహారాష్ట్ర రాష్ట్రానికి తూర్పున ఉన్నఒక భౌగోళిక ప్రాంతం. రాష్ట్రంలోని అమరావతి, నాగ్పూర్ విభాగాలను కలిగి ఉన్నపశ్చిమ భారతదేశంలోని ప్రతిపాదిత రాష్ట్రం. అమరావతి విభాగం పూర్వపు పేరు బేరార్ (మరాఠీలో వర్హాద్).[2][3] ఇది మొత్తం వైశాల్యంలో 31.6% ఆక్రమించింది. మహారాష్ట్ర మొత్తం జనాభాలో 21.3% మంది జనాభాను కలిగి ఉంది. ఇది ఉత్తరాన మధ్యప్రదేశ్, తూర్పున ఛత్తీస్గఢ్, దక్షిణాన తెలంగాణ, పశ్చిమాన మహారాష్ట్రలోని మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలకు సరిహద్దులుగా ఉంది. ఇది మధ్య భారతదేశంలో ఉంది. విదర్భలో అతిపెద్దనగరం నాగ్పూర్ తర్వాత అమరావతి, అకోలా, చంద్రపూర్, గోండియా ఉన్నాయి.[4] ఎక్కువమంది విదర్భ నివాసితులు మరాఠీలోని వర్హాది, జాడి మాండలికాలు మాట్లాడతారు.[5]
విదర్భ | |
---|---|
![]() భారతదేశ పటంలో ఎరుపు రంగులో హైలైట్ చేయబడిన విదర్భ | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
Government | |
• Body | మహారాష్ట్ర ప్రభుత్వం |
విస్తీర్ణం | |
• Total | 97,321 కి.మీ2 (37,576 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 2,30,03,179 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (610/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | మరాఠీ |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
Vehicle registration | ఎంహెచ్- |
పెద్ద పట్టణం | నాగ్పూర్ |
నాగ్పూర్ ప్రాంతం నారింజ, పత్తి పంటలకు ప్రసిద్ధి చెందింది. విదర్భమహారాష్ట్ర ఖనిజ వనరులలో మూడింటరెండు వంతులు దానిఅటవీ వనరులలో మూడింట మూడు వంతులను కలిగి ఉంది. నికరవిద్యుత్ ఉత్పత్తిదారుగా ఉంది.[6] మిగిలిన భారతదేశం అంతటాకంటే విదర్భ చరిత్ర ముఖ్యంగా మతపరమైన సమస్యల సమయంలోచాలా ప్రశాంతంగా ఉంది. అయినప్పటికీ గణనీయమైన పేదరికం [7] పోషకాహార లోపం ఉంది.[8] మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది ఆర్థికంగా తక్కువ సంపన్నమైంది.[9] భారతదేశం మొత్తంతో పోలిస్తే ఈ ప్రాంతంలోని రైతుల జీవన పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నాయి. ఒక దశాబ్దంలోమహారాష్ట్రలో 2,00,000 కంటే ఎక్కువ మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో 70% విదర్భ ప్రాంతంలోని 11 జిల్లాల్లో ఉన్నాయి.[10]
విదర్భలోని అసమర్థ రాజకీయనాయకత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇటీవల విదర్భప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమం కోసం పిలుపులు వచ్చాయి. రాజకీయంగా, ఆర్థికంగా మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఉండటంతో, ఇటీవలి సంవత్సరాలలోఈ ప్రాంతానికి చెందిన నాయకులను, ఇతరరాజకీయ నాయకులు పక్కన పెట్టినప్పుడు మాత్రమే ప్రత్యేక రాష్ట్రంకోసం పిలుపులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.[11] ప్రధాన రాష్ట్రరాజకీయపార్టీ శివసేన వ్యతిరేకతకారణంగా ప్రత్వేక రాష్ట్ర ఆశయాలు నెరవేరలేదు.[12]