రేలంగి వెంకట్రామయ్య
భారతీయ సినిమా నటుడు / From Wikipedia, the free encyclopedia
రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 - నవంబరు 27, 1975)[2] పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[3] తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు(రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. 1935లో కృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి.పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.[4] కానీ, 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేసాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా తారాస్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975లో వచ్చిన పూజ.[3] చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించాడు.
రేలంగి వెంకట్రామయ్య | |
---|---|
జననం | రేలంగి వెంకట్రామయ్య (1910-08-09)1910 ఆగస్టు 9 |
మరణం | 1975 నవంబరు 27(1975-11-27) (వయసు 65)[1] |
మరణ కారణం | వృద్ధాప్యం |
ఇతర పేర్లు | రేలంగి, రేలంగోడు.. |
విద్య | తొమ్మిదో తరగతి |
విద్యాసంస్థ | మెక్లారిన్ హైస్కూలు, కాకినాడ |
వృత్తి | హాస్య నటుడు |
జీవిత భాగస్వామి | బుచ్చియమ్మ |
పిల్లలు | సత్యనారాయణ బాబు |
తల్లిదండ్రులు |
|