![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/Rishi_valley_pano_view.jpg/640px-Rishi_valley_pano_view.jpg&w=640&q=50)
రిషి వ్యాలీ పాఠశాల
భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలోని ప్రైవేట్ బోర్డింగ్ పాఠశాల / From Wikipedia, the free encyclopedia
రిషి వ్యాలీ పాఠశాల జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన భారతీయ ఆశ్రమ పాఠశాల. ఇది ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మదనపల్లె సమీపంలో ఉంది. ఇక్కడి విద్యా విధానం కృష్ణమూర్తి బోధనా దృక్కోణం ఆధారపడి ఉంది. సమాజ సేవ, పాఠ్యేతర కార్యకలాపాలు, చర్చలు, సమావేశాలు, ప్రత్యేక ఆసక్తులపై సమావేశాలూ విద్యార్థుల పాఠశాల విద్యలో భాగం. ఈ పాఠశాల బహుళశ్రేణి బోధన పద్ధతిని ఆవిష్కరించింది. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా, ప్రపంచంలో చాలా చోట్ల ఆదరణ పొందింది.
రిషి వ్యాలీ పాఠశాల | |
---|---|
![]() పక్కనే ఉన్న కొండపై నుండి ప్రాంగణ దృశ్యం | |
స్థానం | |
![]() | |
, | |
సమాచారం | |
రకం | ప్రైవేట్ ఆశ్రమ పాఠశాల |
స్థాపన | 1926 |
స్థాపకులు | జిడ్డు కృష్ణమూర్తి |
పాఠశాల పై పర్యవేక్షణ | అన్నమయ్య జిల్లా |
డైరెక్టర్ | మీనాక్షి తపన్ |
ప్రిన్సిపాల్ | అనంత జ్యోతి |
బోధనా సిబ్బంది | 59 |
తరగతులు | 4–12 |
వయస్సు | 8-17 |
విద్యార్ధుల సంఖ్య | ~365 |
వసతిగృహాలు | 20 |
పరీక్షల బోర్డు | ఐసిఎస్ఇ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ |
ఈ ఆశ్రమ పాఠశాల రిషి లోయలో 375 ఎకరాల విస్తీర్ణంలో, కొండలు, చిన్న గ్రామాల మధ్యలో ఉన్నది. కొండవాలు (ఆంగ్లంలో 'వ్యాలీ') ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడ ఋషులు నివసించేవారనే జానపద కథనాలున్నందునా ఈ ప్రాంతానికి "ఋషివ్యాలీ" లేదా రిషి వ్యాలి అనేపేరు వచ్చింది. హార్సిలీ హిల్స్ నుండి, ఈ లోయ ప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. ఇది మదనపల్లె పట్టణానికి 16 కి.మీ. దూరంలో, మదనపల్లె - కదిరి మార్గంలో ఉంది. ప్రధాన రహదారి నుండి, 5 కి.మీ. లోతట్టున ఈ పాఠశాల ఉంది. తిరుపతి నుండి రెండు గంటలు, బెంగుళూరు నుండి రెండున్నర గంటలు, చెన్నై నుండి ఐదు గంటల ప్రయాణంతో ఈ పాఠశాలను చేరవచ్చు.