రిలయన్స్ ఇండస్ట్రీస్
From Wikipedia, the free encyclopedia
రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశానికి చెందిన ఒక బహుళజాతీయ సంఘటిత సంస్థ. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ముఖేష్ అంబానీ దీనికి సారథ్యం వహిస్తున్నాడు. రిలయన్స్ కు దేశవ్యాప్తంగా ఎనర్జీ, పెట్రో రసాయననాలు, వస్త్రాలు, సహజ వనరులు, రీటెయిల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేసే అనేక సంస్థలు ఉన్నాయి. ఇది భారతదేశంలో అత్యంత లాభదాయకమైన కంపెనీ.[3] మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం బహిరంగ మార్కెట్లో ట్రేడ్ చేయబడుతున్న అతి పెద్ద కంపెనీ.[4] ఇటీవలే భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను అధిగమించి అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే సంస్థగా నిలిచింది.[5] 2020 సెప్టెంబరు 10 నాటికి 200 బిలియన్ డాలర్లు మార్కెట్ విలువ దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.[6]
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | INE002A01018 |
పరిశ్రమ | సంఘటిత సంస్థ |
స్థాపన | 8 May 1973; 51 సంవత్సరాల క్రితం (8 May 1973) |
స్థాపకుడు | ధీరుభాయ్ అంబానీ |
ప్రధాన కార్యాలయం | ముంబై, మహారాష్ట్ర , |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
కీలక వ్యక్తులు | ముకేష్ అంబానీ (ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్) |
ఉత్పత్తులు |
|
రెవెన్యూ | ₹6,59,205 crore (US$92 billion)[1] (2020) |
Operating income | ₹1,02,280 crore (US$13 billion) [1] (2020) |
Net income | ₹44,324 crore (US$5.6 billion) [1] (2020) |
Total assets | ₹11,65,915 crore (US$150 billion)[1] (2020) |
Total equity | ₹4,46,992 crore (US$56 billion) [1] (2020) |
యజమాని | ముకేష్ అంబానీ (50.49%)[2] |
ఉద్యోగుల సంఖ్య | 195,618 (2020)[1] |
అనుబంధ సంస్థలు |
|
వెబ్సైట్ | www |
2020 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో కంపెనీ 96 వ స్థానంలో ఉంది.[7] ఇది 2016 నాటికి టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలలో 8 వ స్థానంలో ఉంది. రిలయన్స్ భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతోంది. భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతుల్లో 8% అంటే 1,47,755 కోట్ల రూపాయల విలువ గలిగినది. 108 దేశాలలో మార్కెట్లలో అందుబాటులో ఉంది.[8] కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా భారతదేశ మొత్తం ఆదాయంలో దాదాపు 5% రిలయన్స్ ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వస్తుంది. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారు.[8][9]