![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6d/Indian_Election_Symbol_Ceiling_Fan.svg/langte-640px-Indian_Election_Symbol_Ceiling_Fan.svg.png&w=640&q=50)
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
భారతదేశంలో రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనేది బీహార్ లోని రాజకీయ పార్టీ. 2013, మార్చి 3న ఉపేంద్ర కుష్వాహా ఈ పార్టీని ప్రారంభించాడు.[1][2] నితీష్ కుమార్, ఉపేంద్ర కుష్వాహా మధ్య వైరం ఫలితంగా పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత కుష్వాహా నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ను విడిచిపెట్టి తన స్వంత పార్టీని స్థాపించాడు.[3] ఇది 2015 నుండి అనేక తిరుగుబాట్లను, విద్రోహాలను ఎదుర్కొంది.[4][5][6] నితీష్, కుష్వాహా మధ్య సంబంధాలు సాధారణీకరించబడిన తర్వాత, ఉపేంద్ర కుష్వాహా 2021 మార్చి 14న ఈ పార్టీని జెడియులో విలీనం చేశాడు.[7]
త్వరిత వాస్తవాలు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, స్థాపకులు ...
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ | |
---|---|
స్థాపకులు | ఉపేంద్ర కుష్వాహా |
స్థాపన తేదీ | 3 మార్చి 2013 (11 సంవత్సరాల క్రితం) (2013-03-03) |
రద్దైన తేదీ | 14 మార్చి 2021 (3 సంవత్సరాల క్రితం) (2021-03-14) |
ఈసిఐ హోదా | రాష్ట్ర పార్టీ |
కూటమి | ఎన్.డి.ఎ. (2014—2018) యుపిఎ (2018—2020) గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ (2020—2021) |
Election symbol | |
![]() |
మూసివేయి