రాష్ట్రీయ జనతా దళ్
భారతదేశం యొక్క రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ భారతదేశ రాజకీయ పార్టీలలో ఒకటి. ఈ పార్టీని 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించాడు. ఆర్జేడీ పార్టీ బీహార్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలలో పోటీ చేసింది.[1][2] రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ఇతర వెనుకబడిన తరగతులు, దళితులు, ముస్లింలు, పార్టీ నిమ్న కుల సంక్షేమమే ప్రధాన లక్షంగా ఏర్పాటైంది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ 2008లో ఈశాన్య రాష్ట్రాలలో పనితీరును అనుసరించి గుర్తింపు పొందిన జాతీయ స్థాయి పార్టీ హోదాను,[3] 2010 జూలై 30న జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది.[4]