దాసరి రామతిలకం
From Wikipedia, the free encyclopedia
దాసరి రామతిలకం (1905-1952) సంగీత, నృత్య కళాకారిణి, రంగస్థల నటి, తొలి తరపు తెలుగు సినిమా నటి. తొలినాటి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి గిరిజ ఈమె కుమార్తె. రామతిలకం చింతామణి చిత్రంలో చింతామణి పాత్రను పోషించారు. తెలుగు తెరపై వేశ్య పాత్ర పోషించిన తొలి కథానాయిక ఈమే.[1]