రాజ్నంద్గావ్
From Wikipedia, the free encyclopedia
రాజ్నంద్గావ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్నంద్గావ్ జిల్లాలోని నగరం. 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం నగర జనాభా 1,63,122.[2] రాజనంద్గావ్ జిల్లాను 1973 జనవరి 26 న దుర్గ్ జిల్లాను విభజించి ఏర్పాటు చేసారు.[4]
రాజనందగావ్ | |
---|---|
నగరం | |
Nickname: నందగావ్ | |
Coordinates: 21.10°N 81.03°E / 21.10; 81.03 | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఛత్తీస్గఢ్ |
జిల్లా | రాజనందగావ్ |
Government | |
విస్తీర్ణం | |
• Total | 70 కి.మీ2 (30 చ. మై) |
Elevation | 307 మీ (1,007 అ.) |
జనాభా | |
• Total | 1,63,122 |
• Rank | 6 (రాష్ట్రంలో) |
• జనసాంద్రత | 2,300/కి.మీ2 (6,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 491441 |
Telephone code | 07744 |
Vehicle registration | CG-08 |
లింగనిష్పత్తి | 1023 ♂/♀ |
ఒరిజినల్గా దీని పేరు నందగావ్. రాజ నంద్ గావ్ రాజ్యాన్ని సోమవంశీయులు, కాలచుర్యులు, మరాఠాలు పాలించారు.[5] రాజనంద్గావ్ పట్టణంలోని రాజభవనాలు పాలకులు, వారి సమాజం, సంస్కృతి, ఆ కాలపు సంప్రదాయాల గురించిన కథలను వెల్లడిస్తాయి.[4]
ఈ నగరాన్ని వైష్ణవ్, గోండు రాజా అనే హిందూ సంరక్షకుల (బైరాగులు) రాజవంశాలు పాలించాయి. దత్తత ద్వారా వీరికి వారసత్వం వచ్చింది. 18 వ శతాబ్దం చివరిలో పంజాబ్ నుండి వచ్చిన మత బ్రహ్మచారి ఈ రాజ్యానికి పునాది వేసాడు. స్థాపకుడి నుండి 1879 వరకు అతని శిష్యుల పాలనలో ఉంటూ వచింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాలకుడిని వంశపారంపర్య అధిపతిగా గుర్తించి, రాజనందగావ్ను సంస్థానంగా ఏర్పరచింది. మొదటి పాలకుడు ఖాసి దాస్ మహంత్ ను 1865 లో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారుగా గుర్తించింది. అతనికి దత్తత తీసుకునే సనదు నిచ్చింది. తరువాత బ్రిటిష్ వారు పాలక మహాంత్కు రాజా అనే బిరుదును ప్రదానం చేశారు.[6][7]