From Wikipedia, the free encyclopedia
రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, (జననం:1954 ఏప్రిల్ 23) ఒక భారతీయ రాజనీతిజ్ఞుడు, అతను ప్రస్తుత బీహార్ 29వ గవర్నరుగా 2023 ఫిబ్రవరి 14 నుండి అధికారంలో ఉన్నారు.[1][2] అతను గతంలో హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నర్గా పనిచేశాడు, గోవా నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన మొదటి వ్యక్తి. అతను గోవా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసాడు.[3] గోవా శాసనసభ మాజీ స్పీకర్. భారతీయ జనతా పార్టీ చెందిన రాజకీయ నాయకుడు.
రాజేంద్ర అర్లేకర్ | |||
29వ బీహార్ గవర్నర్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 ఫిబ్రవరి 14 | |||
ముందు | ఫగు చౌహాన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | పనాజీ | 1954 ఏప్రిల్ 23||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అనఘా అర్లేకర్ | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్సైటు | http://www.rajendraarlekar.in |
అర్లేకర్ చిన్నతనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. 1989 లో ఇతను భారతీయ జనతా పార్టీలో చేరిక అయ్యాడు. 1980 దశాబ్దం కాలంలో గోవా రాష్ట్ర బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉండేవాడు. ఆ తర్వాతి కాలంలో లో ఆ రాష్ట్రంలోని బిజెపి పార్టీ జనరల్ సెక్రెటరీగా, గోవా పారిశ్రామిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్గా, గోవా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఇంకా వెనకబడ్డ తరగతుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా వివిధ పదవులు చేపట్టాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.