మహేష్ భట్
From Wikipedia, the free encyclopedia
మహేశ్ భట్ (జననం 20 సెప్టెంబరు 1948) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతడు ముఖ్యంగా హిందీ సినిమాకు పనిచేశాడు. 1984లో ఇతడు దర్శకత్వం వహించిన సారాంశ్ అనే సినిమా 14వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఈ సినిమా ఆ యేడాది ఉత్తమ విదేశీ చిత్రం క్యాటగరీకి ఆస్కార్ అవార్డు కొరకు భారత దేశ ప్రభుత్వం చేత ప్రతిపాదించబడింది.[2] 1986లో వచ్చిన నామ్ ఇతని మొట్టమొదటి వాణిజ్య సినిమా. 1987లో ఇతడు కబ్జా అనే సినిమాతో ఇతడు నిర్మాతగా మారాడు. ఇతడు తన సోదరుడు ముఖేష్ భట్తో కలిసి "విశేష్ ఫిల్మ్స్" బ్యానర్పై సినిమాలు తీశాడు.
త్వరిత వాస్తవాలు మహేశ్ భట్, జననం ...
మహేశ్ భట్ | |
---|---|
મહેશ ભટ્ટ | |
జననం | (1948-09-20) 1948 సెప్టెంబరు 20 (వయసు 75)[1] |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు, నిర్మాత, సినిమా రచయిత |
జీవిత భాగస్వామి | కిరణ్ భట్ సోనీ రజ్దాన్ |
పిల్లలు | పూజా భట్ (జ. 1972) రాహుల్ భట్ (జ. 1982) షాహీన్ భట్ (జ. 1988) ఆలియా భట్ (జ. 1993) |
తల్లిదండ్రులు | నానాభాయ్ భట్ సిరీన్ మహమ్మదాలీ |
మూసివేయి
ఇతడు డాడీ, స్వయం, ఆషికీ, దిల్ హై కీ మాన్ తా నహీ, సడక్, సర్, గుమ్రా, క్రిమినల్, హమ్ హై రాహీ ప్యార్ కే, జిస్మ్, మర్డర్, వో లమ్హే వంటి అనేక హిట్ చిత్రాలను తీశాడు.