![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Indianrailwayzones-numbered.png/640px-Indianrailwayzones-numbered.png&w=640&q=50)
మధ్య రైల్వే
From Wikipedia, the free encyclopedia
సెంట్రల్ రైల్వే భారతీయ రైల్వేలు లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము 1853 ఏప్రిల్ 16 న బాంబే నుండి థానే వరకు ఆరంభించబడింది.
మధ్య రైల్వే Central Railway | |
---|---|
![]() 8-మధ్య రైల్వే | |
![]() మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఛత్రపతి శివాజీ టెర్మినస్ | |
ఆపరేషన్ తేదీలు | 1951–ప్రస్తుతం |
మునుపటిది | [ గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే, సింధియా స్టేట్ రైల్వే, ధోల్పూర్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే , వార్ధా కోల్ స్టేట్ రైల్వే , ఇతరములు. |
ట్రాక్ గేజ్ | మిశ్రమము |
ప్రధానకార్యాలయం | ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై |
మధ్య రైల్వే మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, కర్ణాటక రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబరు 5 న గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేతో సహా, గ్వాలియర్ మాజీ రాచరిక రాష్ట్రం యొక్క సింధియా స్టేట్ రైల్వే, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే, వార్ధా కోల్ స్టేట్ రైల్వే, ధోల్పూర్ రైల్వేలు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది.[1][2] మధ్య రైల్వే జోన్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు, సిబ్బంది పరంగా భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త పశ్చిమ మధ్య రైల్వే జోనుగా ఏర్పాటు అయ్యింది.
![Central Railway Headquarters.](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/25/Central_Railway_Headquarters.jpg/320px-Central_Railway_Headquarters.jpg)