భారతదేశంలో మరణశిక్ష
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మరణ దండన అమలు విధానం / From Wikipedia, the free encyclopedia
మరణ శిక్ష, భారతదేశంలో చట్టపరమైన శిక్ష.[1] భారతదేశ రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు ఉంది. ఈ హక్కుకు భంగం కలిగించడమే ఉరిశిక్షకు ప్రామాణికం.[2] 1995 నుంచి ఇప్పటి దాకా 9 సార్లు ఈ శిక్ష అమలు చేశారు.[3][4][5] హత్య, హత్యాయత్నం, అత్యాచారం చేసి చంపటం, సామూహిక అత్యాచారం, దేశద్రోహం, సైన్యంలో తిరుగుబాటు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్రమైన నేరాలకు భారతదేశంలో మరణ దండన విధిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారిగా మహాత్మా గాంధీ హత్యకేసులో దోషిగా తేలిన నాథూరాం గాడ్సేను 1949లో ఉరి తీశారు. ఇదే కేసులో కుట్రదారైన నారాయణ్ ఆప్టేకు మరణశిక్ష అమలు చేశారు.