భారత జనాభా లెక్కలు
From Wikipedia, the free encyclopedia
2011 నాటికి భారతదేశంలో జనాభా లెక్కలను 15 సార్లు నిర్వహించారు.1872 లో బ్రిటిష్ రాజప్రతినిధి మాయో ఆధ్వర్యంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీనిని చేపట్టారు. మొదటి పూర్తి జనాభా గణన 1881లో తీసుకోబడింది.[1] 1949 తరువాత, దీనిని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద, భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ నిర్వహించారు. 1951 నుండి జనాభా లెక్కలన్నీ 1948 భారత జనాభా గణాంకాల చట్టం ప్రకారం జరిగాయి.చివరి జనాభా గణన 2011లో జరిగింది, తదుపరి జనాభా గణన 2021లో జరగాల్సి ఉంది. చారిత్రాత్మకంగా, సమాచార సేకరణ, సమాచార వ్యాప్తి మధ్య చాలా కాలం ఉంది. [2]