బెల్లంపల్లి రెవెన్యూ డివిజను
From Wikipedia, the free encyclopedia
బెల్లంపల్లి రెవెన్యూ డివిజను తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మంచిర్యాల జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం బెల్లంపల్లిలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం, బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.[3]