బహుజన్ సమాజ్ పార్టీ
భారతదేశానికి చెందిన రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో ఒక జాతీయ పార్టీ. సమాజంలో హెచ్చు సంఖ్యలో ఉన్నవారికి (వెనుకబడిన కులాలు, హరిజనులు, గిరిజనులు, మత పరంగా మైనారిటీ) ప్రాతినిథ్యం ఇవ్వడానికి ఏర్పడ్డ పార్టీ ఇది.[2] ఈ పార్టీని 1984 లో కాన్షీరామ్ స్థాపించాడు. ఆయన ఈ పార్టీ ఏర్పాటు చేసినపుడు భారతదేశంలో సుమారు 6000 కులాల్లో వర్గీకరించబడిన బహుజనులు మొత్తం జనాభాలో 85% ఉన్నారని అంచనా వేశాడు.[3][4] ఈ పార్టీ గౌతమ బుద్ధుడు, బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహరాజ్ మొదలైన వారి ఆదర్శాలతో ప్రారంభించినట్లు చెప్పారు.[5] కాన్షీరామ్ 2001 లో మాయావతిని తన వారసురాలిగా ప్రకటించాడు. ఈ పార్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. 2019 భారత సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 19.3 శాతం ఓట్లు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఉన్నది.[6] 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 12.8 శాతం ఓట్లతో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది.[7] ఈ పార్టీ గుర్తు ఏనుగు. ఇదే గుర్తును అంబేద్కర్ గిరిజన తెగల సమాఖ్య గుర్తుగా వాడేవాడు.[8]
బహుజన్ సమాజ్ పార్టీ | |
---|---|
లోకసభ నాయకుడు | గిరీష్ చంద్ర |
రాజ్యసభ నాయకుడు | రాంజీ గౌతమ్ |
స్థాపకులు | కాన్షీరామ్ |
స్థాపన తేదీ | 14 ఏప్రిల్ 1984 (40 సంవత్సరాల క్రితం) (1984-04-14) |
Preceded by | దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి |
ప్రధాన కార్యాలయం | 12, గురుద్వారా రకబ్గంజ్ రోడ్డు, న్యూఢిల్లీ |
రాజకీయ విధానం | ఆత్మ గౌరవం[1] |
రంగు(లు) | నీలం |
ఈసిఐ హోదా | జాతీయ పార్టీ |
కూటమి | శిరోమణి అకాలీ దళ్ (2021—present) (పంజాబ్) |
లోక్సభలో సీట్లు | 10/543 |
రాజ్యసభలో సీట్లు | 1/245 |
Election symbol | |