తెలుగు రచయిత, కవి From Wikipedia, the free encyclopedia
ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి.
బసవరాజు అప్పారావు | |
---|---|
జననం | బసవరాజు వేంకట అప్పారావు 1894 డిసెంబరు 13 పటమట, విజయవాడ, కృష్ణా జిల్లా |
మరణం | 1933 జూన్ 10 38) పటమట, విజయవాడ, కృష్ణా జిల్లా | (వయసు
మరణ కారణం | మనోవైకల్యము |
జాతీయత | భారతీయుడు |
విద్య | బి. ఏ., బి. యల్. |
విద్యాసంస్థ | ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు |
వృత్తి | కవి, సంపాదకుడు, న్యాయవాది |
క్రియాశీల సంవత్సరాలు | 1916-1932 |
ఉద్యోగం | ఆంధ్రపత్రిక, భారతి |
జీవిత భాగస్వామి | రాజ్యలక్ష్మి |
తల్లిదండ్రులు | పిచ్చయ్య, వెంకమ్మ |
సంతకం | |
బసవరాజు వెంకట అప్పారావు (1894 - 1933) కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ముఖ్య స్థానాన్ని పొందారు.
బసవరాజు అప్పారావు (1894-1933) విజయవాడ సమీపంలోని పటమట గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మని వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక, భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
ఆయన భార్య రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.[1] అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు. పూర్తిస్థాయి వ్యాసం: బసవరాజు రాజ్యలక్ష్మి
బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావులు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే, నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు."సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం" అని.
బసవరాజు అప్పారావు గారి మరణానంతరం బెజవాడలోని అప్పారావు మెమోరియల్ కమిటీ వారు 1934 సంవత్సరంలో ముద్రించిన "బసవరాజు అప్పారావు గీతములు" పుస్తకంలో ప్రచురించబడినవి.[2]
అప్పారావు వ్రాసిన పాటలను గూడవల్లి రామబ్రహ్మం తన సినిమా మాలపిల్లలో (1938) పరిచయం చేశాడు.సూరిబాబు పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. కాంచనమాల సుందరమ్మలు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను బందా కనకలింగేశ్వరరావు పాడాడు. తాజ్మహల్ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను టంగుటూరి సూర్యకుమారి, బాలమురళీకృష్ణ, రావు బాలసరస్వతీ దేవి మధురంగా పాడారు. అప్పారావు 1933 లోమరణించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.