పురానీ హవేలీ
హైదరాబాదులోని భవనం / From Wikipedia, the free encyclopedia
పురనీ హవేలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గల ఒక రాజభవనం. ఇది నిజాం యొక్క అధికార నివాసం. దీనిని "హవేలీ ఖాదీమ్"గా కూడా పిలుస్తారు. దీని అర్థం "పాత భవనం" అని. ఈ భవనాన్ని సికిందర్ జా, ఆసఫ్ జా III (1803–1829) కోసం ఆయన తండ్రి అలీ ఖాన్ బహదూర్, ఆసఫ్ జా II నిర్మించారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
Purani Haveli పురాని హవేలీ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాయల్ హవేలీ |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము |
పూర్తి చేయబడినది | 1880లు |
1717 లో రెండవ నిజాం అయిన నిజాం మిర్ నిజాం అలీ ఖాన్ దీనిని మోమిన్ సామ్రాజ్యానికి చెందిన రుకుందల్లా నుండి తీసుకొనెను. ప్రధాన భవనం 18 వ శతాబ్దపు యూరోపియన్ నిర్మాణశైలికి ప్రతీకగా ఉంటుంది. సికందర్ జా ఇచట కొంతకాలం నివసింది తరువాత ఖిల్వత్ మహల్ కు మారారు.ఈ కారణంగా ఈ భావ్నం పురానీ హవేలీగా పిలువబడుతుంది. ఈ భవన సముదాయంలో ఆయినా ఖానా (దర్పణాల భవనం), చీనీ ఖానా (చైనా గాజు భవనం) నిర్మించబడినాయి.
ప్రస్తుతం దక్షిణ జోన్ డిప్యూటీకమీషనర్ ఆఫ్ పోలీసు (హైదరాబాదు), దక్షిణ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అడిషనల్ డి.సి.పి కార్యాలయాలు ఈ భవనం నుండి నిర్వహింపబడుతున్నవి.