పిట్ ఇండియా చట్టం
From Wikipedia, the free encyclopedia
పిట్ ఇండియా చట్టం(Pitt's India Act)గా ప్రాచుర్యంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ చట్టం 1784, 1773 నాటి నియంత్రణా చట్టంలోని లోపాలను సవరించి భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనను బ్రిటీష్ ప్రభుత్వం నియంత్రణ కిందికి తీసుకువచ్చే గ్రేట్ బ్రిటన్ పార్లమెంటు(Parliament of Great Britain) చట్టం. ఆనాటి బ్రిటీష్ ప్రధాని విలియం పిట్ పేరిట దీన్ని పిట్ ఇండియా చట్టంగా పిలిచారు. దీని ప్రకారం బ్రిటీష్ ఇండియా పరిపాలన కంపెనీ, బ్రిటీష్ ప్రభుత్వం రెండూ సంయుక్తంగా నిర్వహిస్తాయి, అయితే అంతిమ అధికారం బ్రిటీష్ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాజకీయ వ్యవహారాలను చూసేందుకు ఆరుగురు సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ ని, ఆర్థిక వ్యవహారాలను చూసుకునేందుకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఏర్పరిచింది.