పి. బి. శ్రీనివాస్
From Wikipedia, the free encyclopedia
పి. బి. శ్రీనివాస్ (సెప్టెంబరు 22, 1930 - ఏప్రిల్ 14, 2013) (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్)[1] చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఆయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు. ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నటదిగ్గజం రాజ్కుమార్కు శ్రీనివాస్ ఎన్నో గీతాలు ఆలపించారు. శ్రీనివాస్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. శ్రీనివాస్ ఎన్నో గజళ్లు వ్రాసారు. శ్రీనివాస్ గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా జాతక ఫలం (1954) చిత్రంలో పాడారు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడారు.[2]
త్వరిత వాస్తవాలు పి. బి. శ్రీనివాస్, జననం ...
పి. బి. శ్రీనివాస్ | |
---|---|
![]() పి. బి. శ్రీనివాస్ | |
జననం | సెప్టెంబరు 22, 1930 గొల్లప్రోలు, కాకినాడ, మద్రాసు రాష్ట్రం |
మరణం | ఏప్రిల్ 14, 2013 చెన్నై . తమిళనాడు |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | పి.బి.ఎస్. |
వృత్తి | నేపథ్యగాయకుడు |
మతం | హిందూ మతం |
తండ్రి | ఫణీంద్రస్వామి |
తల్లి | శేషగిరమ్మ |
మూసివేయి