పాత ఢిల్లీ
From Wikipedia, the free encyclopedia
పాత ఢిల్లీ, ఢిల్లీ నగరం లోని భాగం. 1639 లో షాజహానాబాద్ పేరుతో షాజహాన్ దీనిని నిర్మించాడు.తన రాజధానిని ఆగ్రా నుండి దీని నిర్మాణం 1639 లో ప్రారంభమై 1648 లో పూర్తయింది. అప్పటి నుండి 1857 లో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ ఇది వారికి రాజధానిగా ఉంది.[1][2][3] 1857 తరువాత ఇది బ్రిటిషు వారి అధీనంలోకి వచ్చింది. ఐతే బ్రిటిషువారు కలకత్తానుండి రాజ్యం చేస్తున్నందువలన ఢిల్లీ, రాజధాని నగరం హోదాను కోల్పోయింది.ఇది మధ్య ఢిల్లీ జిల్లా పరిధిలో ఉంది.
— గోడల నగరం — | |
దేశం | భారతదేశం |
---|---|
కేంద్రపాలిత ప్రాంతం | ఢిల్లీ |
జిల్లా | మధ్య ఢిల్లీ జిల్లా |
దీనిని 1911 లో మరల రాజధానిగా ప్రకటించిన తరువాత పునర్వైభవం అందుకుంది.ఇది మొగలుల చారిత్రిక నిర్మాణాలకు ప్రతీకగా నిలిచింది.ఒకప్పుడు దర్బారు ఉద్యోగుల నివాస భవనాలతో, అందమైన మసీదులు, తీటలతో పాత ఢిల్లీ కళకళలాడుతూ ఉండేది. నేటికీ, జనసంద్రం దీన్ని ముంచెత్తినప్పటికీ, ఇది మెట్రోపాలిటన్ ఢిల్లీకి కేంద్రంగానే ఉంది. ఆనాటి హవేలీలు కొద్ది సంఖ్యలో మాత్రమే మిగిలాయి. ఆనాటి ఇస్లామిక్ శైలి నిర్మాణాలకు ప్రతీక వంటి జామా మసీదు వంటి కొన్ని నిర్మాణాలు ఇంకా హుందాగా నిలబడి ఉన్నాయి. పాత ఢిల్లీ వీధి తినుబండారాలకు, షాపింగుకూ కూడా ప్రసిద్ధి.
2012 లో ఢిల్లీ నగరపాలక సంస్థను మూడు విభాగాలుగా విభజించాక, పాత ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషను పాలన లోకి వచ్చింది.[4][5]