పరమ వీర చక్ర
భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం / From Wikipedia, the free encyclopedia
పరమ వీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేస్తారు. ఈ పేరుకు అర్థం "అత్యున్నత ధైర్య చక్రం",[1] ఈ పురస్కారం అమెరికాకు చెందిన "మెడల్ అఫ్ ఆనర్", బ్రిటన్ కు చెందిన "విక్టోరియా క్రాస్"కు సమానం.[2][3]
త్వరిత వాస్తవాలు పురస్కారం గురించి ...
పరమ వీర చక్ర | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | యుద్ధ సమయంలో సాహసాలకు | |
వ్యవస్థాపిత | 1950 | |
మొదటి బహూకరణ | 1947 | |
క్రితం బహూకరణ | 1999 | |
మొత్తం బహూకరణలు | 21 | |
బహూకరించేవారు | భారతీయ ప్రభుత్వం | |
రిబ్బను | ||
మొదటి గ్రహీత(లు) | మేజర్ సోమనాథ్ శర్మ (మరణానంతరం) | |
క్రితం గ్రహీత(లు) | కెప్టెన్ విక్రమ్ బాత్రా (మరణానంతరం) | |
Award Rank | ||
భారత్ రత్న ← పరమ వీర చక్ర → మహా వీర చక్ర |
మూసివేయి
శాంతి సమయాలలో ఇచ్చే అశోక చక్ర అనే మరో పురస్కారం పరమ వీర చక్రకు సమానం. పరమ వీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ అశోక చక్ర మాత్రం ఏ భారతీయనికైనా ప్రదానం చెయ్యవచ్చు. పరమ వీర చక్రకు మాదిరి గానే అశోక్ చక్ర కూడా చనిపోయిన తరువాత కూడా పురస్కరించ వచ్చు.[4] పురస్కార గ్రహీతలకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాల నుండి అనేక భత్యాలు అందచేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి భత్యాలు అందిస్తున్నాయి.